thumbnail

LIVE : సికింద్రాబాద్​​ టు గోవా స్పెషల్​ ట్రైన్​ను ప్రారంభిస్తున్న కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి - Kishan Reddy To Launch Spl Train

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Updated : 48 minutes ago

Kishan Reddy Launched Direct Train To Goa Live : సికింద్రాబాద్​​ నుంచి నేరుగా గోవాకు వెళ్లేలా సికింద్రాబాద్ - వాస్కోడిగామా రైలును రైల్వేశాఖ అందుబాటులోకి తెచ్చింది. ఇవాళ్టి నుంచి సికింద్రాబాద్ - గోవా రైలు పట్టాలెక్కనుంది. ఈ స్పెషల్​ రైలును కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జెండా ఊపి రైలును ప్రారంభిస్తున్నారు. వారంలో రెండు రోజుల పాటు ఈ సర్వీసు అందుబాటులో ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి వాస్కోడిగామా వెళ్లే రైలు బుధ, శుక్రవారాల్లో అందుబాటులో ఉంటుంది. ప్రతి రోజూ ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు వాస్కోడిగామా చేరుకుంటుంది. వాస్కోడిగామా నుంచి సికింద్రాబాద్​కు గురు, శనివారాల్లో అందుబాటులో ఉంటుంది. ఉదయం 9 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 6.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రైలును జెండా ఊపి ప్రారంభించి, అనంతరం ఆయన మాట్లాడుతున్నారు. 
Last Updated : 48 minutes ago

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.