LIVE : అప్పకపల్లెలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన సీఎం - CM REVANTH REDDY LIVE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Feb 21, 2025, 1:12 PM IST

CM Revanth Reddy Live : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి ఇవాళ శ్రీకారం చుట్టారు. మొదటి విడతలో మంజూరైన 72,045 ఇళ్లకు నారాయణపేట జిల్లా అప్పకపల్లిలో లాంఛనంగా శంకుస్థాపన చేశారు. వికారాబాద్​, నారాయణపేట జిల్లాల్లో పర్యటిస్తున్న సీఎం రేవంత్​ రెడ్డి, ఇలా పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ముందుగా హైదరాబాద్​ నుంచి మధ్యాహ్నానికి హెలికాప్టర్​లో వికారాబాద్​ జిల్లా దుద్యాల మండలం పోలెపల్లి గ్రామానికి చేరుకున్నారు. అక్కడ ఏటా ఘనంగా నిర్వహిస్తున్న పోలెపల్లి ఎల్లమ్మ జాతరలో పాల్గొన్నారు. జాతరలో ప్రధాన ఘట్టమైన సిడెను అమ్మవారి దర్శన అనంతరం తిలకిస్తున్నారు. సీఎం రాకతో పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లను చేశారు. అనంతరం పోలెపల్లి నుంచి హెలికాప్టర్​లోనే నేరుగా నారాయణపేట జిల్లాలోని జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్​ బంకు, సమాఖ్య భవనం, ఇందిరమ్మ గృహాలకు శంకుస్థాపన చేస్తున్నారు. ఇంకా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.