ETV Bharat / state

ఆ ముగ్గురు ఐపీఎస్​లు వెళ్లి ఏపీలో రిపోర్టు చేయండి - కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు - 3 IPS OFFICERS REPORT TO AP

కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు - ముగ్గురు ఏపీ క్యాడర్ ఐపీఎస్‌ అధికారులకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు - 24గంటల్లో వారు ఏపీ క్యాడర్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశం

AP Cadre IPS Officers
AP Cadre IPS Officers (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 22, 2025, 6:41 AM IST

AP Cadre IPS Officers : రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ఐపీఎస్​ అధికారులు ఇవాళ ఆంధ్రప్రదేశ్​లో రిపోర్ట్​ చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. రహదారి భద్రత అథారిటీ ఛైర్మన్​గా ఉన్న అంజనీ కుమార్​, తెలంగాణ పోలీసు అకాడమీ డైరెక్టర్​ అభిలాష బిస్త్, కరీంనగర్​ పోలీసు కమీషనర్​ అభిషేక్ మహంతిని ఏపీకి వెళ్లాలని ఆదేశించింది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత అఖిల భారత సర్వీసు అధికారులను రెండు రాష్ట్రాలకు డీఓపీటీ(DOPT) కేటాయించింది. ఈ కేటాయింపులను వ్యతిరేకిస్తూ 10 మంది ఐఏఎస్​లు, ముగ్గురు ఐపీఎస్​లు అప్పట్లో క్యాట్​ను ఆశ్రయించారు.

AP Cadre IPS Officers
అంజనీ కుమార్, ఐపీఎస్​ (ETV Bharat)
AP Cadre IPS Officers
అభిలాష బిస్త్, ఐపీఎస్​ (ETV Bharat)

ఈ అంశంపై డీవోపీటీ తెలంగాణ హైకోర్టులో పిటీషన్‌ వేసింది. విభజన సమయంలో నియమించిన ప్రత్యూష్‌ సిన్హా కమిటీ సిఫార్సులను పరిగణనలోకి తీసుకుని వీరి అభ్యర్థనలను పరిశీలించాలని గత ఏడాది జనవరిలో హైకోర్టు తీర్పు వెలువరించింది. 2024 మార్చిలో ఖండేకర్‌ కమిటీని నియమించించారు. ఈ కమిటీ సిఫార్సుల మేరకు గత అక్టోబరులో కొందరు ఐఏఎస్​లను ఏపీకి పంపించారు. ఇప్పుడు మరో ముగ్గురు ఐపీఎస్​లను ఏపీలో రిపోర్ట్‌ చేయాలని హోంశాఖ ఆదేశించింది.

AP Cadre IPS Officers
అభిషేక్ మహంతి, ఐపీఎస్​ (ETV Bharat)

AP Cadre IPS Officers : రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ఐపీఎస్​ అధికారులు ఇవాళ ఆంధ్రప్రదేశ్​లో రిపోర్ట్​ చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. రహదారి భద్రత అథారిటీ ఛైర్మన్​గా ఉన్న అంజనీ కుమార్​, తెలంగాణ పోలీసు అకాడమీ డైరెక్టర్​ అభిలాష బిస్త్, కరీంనగర్​ పోలీసు కమీషనర్​ అభిషేక్ మహంతిని ఏపీకి వెళ్లాలని ఆదేశించింది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత అఖిల భారత సర్వీసు అధికారులను రెండు రాష్ట్రాలకు డీఓపీటీ(DOPT) కేటాయించింది. ఈ కేటాయింపులను వ్యతిరేకిస్తూ 10 మంది ఐఏఎస్​లు, ముగ్గురు ఐపీఎస్​లు అప్పట్లో క్యాట్​ను ఆశ్రయించారు.

AP Cadre IPS Officers
అంజనీ కుమార్, ఐపీఎస్​ (ETV Bharat)
AP Cadre IPS Officers
అభిలాష బిస్త్, ఐపీఎస్​ (ETV Bharat)

ఈ అంశంపై డీవోపీటీ తెలంగాణ హైకోర్టులో పిటీషన్‌ వేసింది. విభజన సమయంలో నియమించిన ప్రత్యూష్‌ సిన్హా కమిటీ సిఫార్సులను పరిగణనలోకి తీసుకుని వీరి అభ్యర్థనలను పరిశీలించాలని గత ఏడాది జనవరిలో హైకోర్టు తీర్పు వెలువరించింది. 2024 మార్చిలో ఖండేకర్‌ కమిటీని నియమించించారు. ఈ కమిటీ సిఫార్సుల మేరకు గత అక్టోబరులో కొందరు ఐఏఎస్​లను ఏపీకి పంపించారు. ఇప్పుడు మరో ముగ్గురు ఐపీఎస్​లను ఏపీలో రిపోర్ట్‌ చేయాలని హోంశాఖ ఆదేశించింది.

AP Cadre IPS Officers
అభిషేక్ మహంతి, ఐపీఎస్​ (ETV Bharat)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.