ETV Bharat / state

దీనిని చూసి కిరాణా షాపు అనుకోకండి - ఏంటో తెలిస్తే షాక్ అవుతారు - GRAM PANCHAYAT OFFICE IN A SHED

రేకుల డబ్బాలో మొట్ల తండా గ్రామ పంచాయతీ కార్యాలయం - పంచాయతీ భవన నిర్మాణం కోసం నిధులు మంజూరైనా ప్రారంభం కాని పనులు - వెంటనే పనులు ప్రారంభించాలని స్థానికుల డిమాండ్

MAHABUBABAD DISTRICT
GRAM PANCHAYAT OFFICE IN A SHED (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 22, 2025, 4:27 PM IST

Motla Thanda Grama Panchayath : మీరు దీనిని చూసి కిరాణా షాపో, పాన్ డబ్బానో అనుకునేరు. ఇక్కడ కనిపిస్తున్న రేకుల డబ్బాలో ఉన్నది ఓ గ్రామ పంచాయతీ కార్యాలయం. ఈ విషయం వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. కానీ ఇదే వాస్తవం. ఇది మహబూబాబాద్ జిల్లాకు చెందిన మొట్ల తండాలో ఉంది. 2018లో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. దానిలో భాగంగానే ఈ మొట్ల తండా గ్రామ పంచాయతీగా ఏర్పడింది.

అద్దె చెల్లించకపోవడంతో వచ్చిన తిప్పలు : 2018 నుంచి మొట్ల తండాకు సొంత భవనం లేకపోవడంతో పంచాయతీ కార్యాలయం అక్కడి స్థానికుల ఇళ్లలో అద్దె ప్రాతిపదికన కొనసాగింది. ఇంతకుముందు ఆఫీసు ఉన్న కిరాయి ఇంట్లో శుభకార్యం ఉండడంతో ఆ ఇంటి యజమాని గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఖాళీ చేయించారు. సమయానికి అద్దె డబ్బులు ఇవ్వకపోవడంతో తండాలో గ్రామ పంచాయతీ కార్యాలయానికి అవసరమైన గదిని, ఇంటిని ఎవరూ అద్దెకు ఇవ్వడం లేదు. దీంతో ఎక్కడా భవనం లభించక ఈ రేకుల డబ్బాకు మార్చారు.

ముందుకు రాని కాంట్రాక్టర్లు : ఇటీవల గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి రూ. 20 లక్షలు మంజూరైనట్లు మండల పంచాయతీ అధికారి పార్థ సారధి తెలిపారు. తండాలో ప్రభుత్వం స్థలం కేటాయించినా నిర్మాణం చేసేందుకు గుత్తే దారులు ఎవరూ ముందుకు రాలేదు. అలాగే ఆ స్థలం కొంత వివాదాల్లో కూడా ఉండటం కూడా మరో కారణం.

"ఈ మొట్లతండా గ్రామ పంచాయతీ ఇంతకు ముందు ఓ ఇంటిలో అద్దెకు ఉండేది. ఆ ఇంటి యజమాని బంధువులు, కుటుంబ సభ్యులు రావడం వల్ల ఇక్కడ ఓ కిరాణా కొట్టు డబ్బా ఉంటే అందులో గ్రామ పంచాయతీ ఆఫీసును పెట్టడం జరిగింది. ఈ సమయంలో ఎవరైనా ఇంటిని కిరాయికి ఇస్తే దానిలోకి మార్చుతాం. కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి నిధులను కూడా మంజూరు చేసింది" -పార్థ సారధి, మండల పంచాయతీ అధికారి

పంచాయతీ కార్యాలయం నిర్మించాలని డిమాండ్ : దీంతో చేసేదేమీ లేకపోవడంతో ఓ రేకుల షెడ్డును నెలకు రూ.500లకు చొప్పున అద్దెకు తీసుకొని ప్రస్తుతం అందులో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈ సమస్యను ప్రజాప్రతినిధులు పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు. తక్షణమే గ్రామ పంచాయతీ కార్యాలయం నిర్మాణ పనులను ప్రారంభించి తమ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని తండా వాసులు డిమాండ్ చేస్తున్నారు.

భారీ వర్షాలకు కుప్పకూలిన పంచాయతీ భవనం

ప్రారంభానికి ముందే శిథిలావస్థకు పంచాయతీ భవనం

Motla Thanda Grama Panchayath : మీరు దీనిని చూసి కిరాణా షాపో, పాన్ డబ్బానో అనుకునేరు. ఇక్కడ కనిపిస్తున్న రేకుల డబ్బాలో ఉన్నది ఓ గ్రామ పంచాయతీ కార్యాలయం. ఈ విషయం వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. కానీ ఇదే వాస్తవం. ఇది మహబూబాబాద్ జిల్లాకు చెందిన మొట్ల తండాలో ఉంది. 2018లో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. దానిలో భాగంగానే ఈ మొట్ల తండా గ్రామ పంచాయతీగా ఏర్పడింది.

అద్దె చెల్లించకపోవడంతో వచ్చిన తిప్పలు : 2018 నుంచి మొట్ల తండాకు సొంత భవనం లేకపోవడంతో పంచాయతీ కార్యాలయం అక్కడి స్థానికుల ఇళ్లలో అద్దె ప్రాతిపదికన కొనసాగింది. ఇంతకుముందు ఆఫీసు ఉన్న కిరాయి ఇంట్లో శుభకార్యం ఉండడంతో ఆ ఇంటి యజమాని గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఖాళీ చేయించారు. సమయానికి అద్దె డబ్బులు ఇవ్వకపోవడంతో తండాలో గ్రామ పంచాయతీ కార్యాలయానికి అవసరమైన గదిని, ఇంటిని ఎవరూ అద్దెకు ఇవ్వడం లేదు. దీంతో ఎక్కడా భవనం లభించక ఈ రేకుల డబ్బాకు మార్చారు.

ముందుకు రాని కాంట్రాక్టర్లు : ఇటీవల గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి రూ. 20 లక్షలు మంజూరైనట్లు మండల పంచాయతీ అధికారి పార్థ సారధి తెలిపారు. తండాలో ప్రభుత్వం స్థలం కేటాయించినా నిర్మాణం చేసేందుకు గుత్తే దారులు ఎవరూ ముందుకు రాలేదు. అలాగే ఆ స్థలం కొంత వివాదాల్లో కూడా ఉండటం కూడా మరో కారణం.

"ఈ మొట్లతండా గ్రామ పంచాయతీ ఇంతకు ముందు ఓ ఇంటిలో అద్దెకు ఉండేది. ఆ ఇంటి యజమాని బంధువులు, కుటుంబ సభ్యులు రావడం వల్ల ఇక్కడ ఓ కిరాణా కొట్టు డబ్బా ఉంటే అందులో గ్రామ పంచాయతీ ఆఫీసును పెట్టడం జరిగింది. ఈ సమయంలో ఎవరైనా ఇంటిని కిరాయికి ఇస్తే దానిలోకి మార్చుతాం. కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి నిధులను కూడా మంజూరు చేసింది" -పార్థ సారధి, మండల పంచాయతీ అధికారి

పంచాయతీ కార్యాలయం నిర్మించాలని డిమాండ్ : దీంతో చేసేదేమీ లేకపోవడంతో ఓ రేకుల షెడ్డును నెలకు రూ.500లకు చొప్పున అద్దెకు తీసుకొని ప్రస్తుతం అందులో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈ సమస్యను ప్రజాప్రతినిధులు పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు. తక్షణమే గ్రామ పంచాయతీ కార్యాలయం నిర్మాణ పనులను ప్రారంభించి తమ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని తండా వాసులు డిమాండ్ చేస్తున్నారు.

భారీ వర్షాలకు కుప్పకూలిన పంచాయతీ భవనం

ప్రారంభానికి ముందే శిథిలావస్థకు పంచాయతీ భవనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.