1200 చాక్​పీస్​లతో అయోధ్య రామమందిరం నమూనా- ప్రాణప్రతిష్ఠ రోజే ఆవిష్కరణ

By ETV Bharat Telugu Team

Published : Jan 18, 2024, 10:25 AM IST

thumbnail

Youth Built Chalk Piece Ram Mandir : 1200 చాక్​పీస్​లతో అయోధ్య రామమందిరం నమూనాను రూపొందించాడు ఓ యువకుడు. అతడు తయారుచేసిన చాక్​పీస్ రామమందిరం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయోధ్య రామలయం ప్రాణప్రతిష్ఠ జరగనున్న రోజే, తాను రూపొందించిన చాక్​పీస్ రామమందిరాన్ని ఆవిష్కరిస్తానని చెబుతున్నాడు. అతడే కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా గెరుసొప్పకు చెందిన ప్రదీప్ నాయికా.

హొన్నావర మండలం గెరుసొప్ప గ్రామంలో నివాసం ఉండే చంద్రకళ, మంజునాథ దంపతుల కుమారుడు ప్రదీప్ నాయికా. ప్రదీప్​కు చిన్నప్పటి నుంచి వివిధ కళలపై ఆసక్తి ఉండేది. అలా పెయింటింగ్, తబలా, సంగీతం, చాక్​పీస్​ ఆర్ట్​ వంటి కళల్లో ప్రావీణ్యం సంపాదించాడు. ఈ క్రమంలో చాక్​పీస్​లతో అయోధ్య రామమందిరం నమూన తయారు చేయాలని అనుకున్నాడు. 1200 చాక్​పీస్​లను ఉపయోగించి రామమందిర నమూనాను రూపొందించాడు. దాన్ని తయారుచేయడం కోసం 25 రోజుల్లో 250 గంటల పాటు శ్రమించాడు. ఈ చాక్​పీస్​ల రామమందిరాన్ని అయోధ్య శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగే రోజు (జనవరి 22), గెరుసొప్పలోని శ్రీ గుత్తికన్యకా పరమేశ్వరి ఆలయంలో తన తల్లిదండ్రులు, తదితరుల సమక్షంలో ఆవిష్కరిస్తానని ప్రదీప్ తెలిపాడు. 
ఇంతకుముందు, బుద్ధుడు, గాంధీ, ఈఫిల్ టవర్ వంటి రూపాలను చాక్​పీస్​లపై చెక్కి అబ్బురపరిచాడు ప్రదీప్.18 చాక్​పీస్​లపై జాతీయ గీతాన్ని చెక్కి ఇండియా, ఆసియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు సంపాదించాడు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.