హైటెన్షన్ విద్యుత్ వైర్లలో చిక్కుకున్న పారాగ్లైడర్ - గోవర్ధన మథుర జిల్లా పారాగ్లైడింగ్ ప్రమాదం
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-16945420-thumbnail-3x2-para.jpg)
ఉత్తర్ప్రదేశ్లో పెను ప్రమాదం తప్పింది. అనుమతి లేకుండా వెళ్తున్న ఓ పారాగ్లైడర్ ఒక్కసారిగా హైటెన్షన్ విద్యుత్ వైర్లలో చిక్కుకుంది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి. పారాగ్లైడర్ విద్యుత్ తీగలకు తగిలిన సమయంలో కరెంట్ లేనందున పెను ప్రమాదం తప్పినట్లు స్థానికులు తెలిపారు. మంగళవారం సాయంత్రం మథుర జిల్లాలోని గోవర్ధన్ ప్రాంతంలో కొత్తగా నిర్మించిన రహదారిపై ఈ ఘటన జరిగింది. ఆ పారాగ్లైడర్లో ఓ మహిళతోపాటు పైలట్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో ఆ రహదారిపై కొంత సమయం పాటు రాకపోకలు నిలిచిపోయాయి.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST