thumbnail

By

Published : Mar 6, 2023, 4:24 PM IST

ETV Bharat / Videos

యడియూరప్పకు తప్పిన ముప్పు.. ల్యాండ్ అవుతుండగా..

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా.. ఒక్కసారిగా గాల్లోకి ప్లాస్టిక్ షీట్స్, చెత్త ఎగిరి హెలిప్యాడ్​పైకి వచ్చాయి. పైలట్ వెంటనే అప్రమత్తమై హెలికాప్టర్‌ను వెనక్కి మళ్లించారు. దీంతో యడియూరప్ప ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండింగ్​ అవ్వకుండానే వెనుదిరిగింది. కాసేపు అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. హుటాహుటిన హెలిప్యాడ్​ను అధికారులు శుభ్రం చేయించారు. కాసేపటికి హెలికాప్టర్​ సురక్షితంగా ల్యాండింగ్ అయ్యింది. మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప సురక్షితంగా కిందకు దిగారు. కలబురిగిలోని జేవర్జిలో ఓ కార్యక్రమానికి యడియూరప్ప సోమవారం హాజరవుతుండగా ఈ ఘటన జరిగింది.  

యడియూరప్ప 2022 వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా  పనిచేశారు. ఆయనను తప్పించి బీజేపీ అధిష్ఠానం బసవరాజ్ బొమ్మైను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొబెట్టింది. ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కర్ణాటకలో శివమొగ్గ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. ఈ విమానాశ్రయ నిర్మాణం యడియూరప్ప కలల ప్రాజెక్టు అని మోదీ తెలిపారు.  ఈ కార్యక్రమంలో యడియూరప్ప కూడా పాల్గొనగా.. రాజకీయాల్లో ఆయన సేవలను ప్రధాని మోదీ కొనియాడారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.