భారత్​, చైనా వాస్తవ లెక్కలు చెప్పవు: ట్రంప్​

By

Published : Sep 30, 2020, 10:27 AM IST

thumbnail

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా డొనాల్డ్ ట్రంప్​- జో బైడెన్ మధ్య తొలి సంవాదం జరిగింది. డిబేట్​లో కరోనా అంశంపై చర్చ సమయంలో ట్రంప్​పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు బైడెన్​. అమెరికాలో 70లక్షల మందికి కరోనా సోకిందని, 2 లక్షల మంది మరణించారని తెలిపారు. వైరస్​ కట్టడిలో ఎలాంటి వ్యూహం లేకపోవడం వల్లే ట్రంప్ దారుణంగా విఫలమయ్యారని మండిపడ్డారు. ఈ విషయంపై ట్రంప్ స్పందించారు. తాను సరైన చర్యలు చేపట్టకపోతే అమెరికాలో 20లక్షల మంది వైరస్​కు బలయ్యేవారన్నారు. కరోనా చైనాలో పుట్టిందని గుర్తు చేశారు. భారత్​, చైనా, రష్యాలో వైరస్ వల్ల ఎంత మంది చనిపోయారనే విషయం ఎవరికీ తెలియదని ట్రంప్ అన్నారు. తన చర్యలను సమర్థించుకున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.