ఈ రైలు వచ్చిందంటే పట్టాలపై మంచు క్లియర్ - మంచు కోత యంత్రంతో.. రైలు రూటు క్లియర్!
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5535962-79-5535962-1577682323628.jpg)
మంచు కప్పేసిన ప్రాంతాలను చూస్తే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ..రవాణా మార్గాలపై హిమ రాశులు పేరుకుపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. ఇదే క్రమంలో పట్టాలపై పేరుకుపోయిన మంచు సమస్యకు చెక్ పెడుతున్నారు ఉత్తర రైల్వే అధికారులు. రైలు ఇంజిన్కు అమర్చిన అధునాతన మంచు కోత యంత్రాలతో.. పట్టాలపై గడ్డకట్టిన మంచును అవలీలగా తొలగిస్తున్నారు. ఈ మెషిన్ను జమ్ముకశ్మీర్లోని బనీహల్, శ్రీనగర్, బారాముల్లా విభాగాల్లో ప్రయోగించారు అధికారులు.