thumbnail

జేసీబీపై పెళ్లిమండపానికి వధూవరులు.. కారణమిదే..

By

Published : Jan 24, 2022, 8:17 PM IST

సాధారణంగా పెళ్లికూతురిని పల్లకిలోనో.. కారులోనో తీసుకొస్తారు. కానీ హిమాచల్​ప్రదేశ్​లో ఓ వరుడు.. వధువును జేసీబీలో తీసుకొచ్చాడు. గత రెండు రోజులుగా భారీగా కురుస్తున్న మంచుతో రోడ్లన్నీ మూసుకుపోవటమే అందుకు కారణం. సిర్​మౌర్​ జిల్లాలోని జాగ్వా గ్రామం నుంచి 8 కిలోమీటర్ల దూరంలోని సైంఫర్​ గ్రామానికి బరత్​ వెళ్లాలి. మంచుతో మూసుకుపోయిన రోడ్డును పునరుద్ధరిచేందుకు ప్రయత్నించినా.. ఫలితం లేకపోయింది. చేసేదేమీ లేక జేసీబీలో సైంఫర్​కు చేరుకున్నారు వధూవరులు. పెళ్లి తంతు ముగించుకుని సోమవారం ఉదయం జాగ్వాకు తిరిగి వచ్చారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.