ETV Bharat / entertainment

మెగాస్టార్​తో సాయిదుర్గా తేజ్​ స్క్రీన్ షేరింగ్- విశ్వంభరలో గెస్ట్​ రోల్! - VISHWAMBHARA

పవన్​తో ఓవర్, ఇట్స్ చిరు టైమ్- పెద్దమామతో దుర్గాతేజ్ స్క్రీన్ షేరింగ్- కల నిజమైనట్లే!

Vishwambhara
Vishwambhara (Source : ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 15, 2025, 7:11 PM IST

Sai Durgha Tej Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి లీడ్​ రోల్​లో నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'విశ్వంభర'. ఈ చిత్రాన్ని 'బింబిసార' ఫేమ్ వశిష్ఠ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్​ మెగా అభిమానుల్లో అంచనాలు పెంచేసింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటో కాదు, చిరు మేనల్లుడు సాయిదుర్గా తేజ్ ఈ సినిమాలో ఈ సినిమాలో భాగమైనట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్.

ఇందులో ఆయన గెస్ట్​ రోల్​లో నటిస్తున్నట్లు​ తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఆన్‌స్క్రీన్‌లోనూ హీరో (చిరంజీవి) మేనల్లుడి పాత్రలో సాయి కనిపించనున్నారని సమాచారం. ఇదే నిజమైతే మెగా ఫ్యాన్స్​కు డబుల్ ట్రీట్ అన్నట్లే. కాగా, దుర్గా తేజ్ ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కల్యాణ్​తో 'బ్రో' (BRO) సినిమాలో ఫుల్​ లెంగ్త్​లో నటించారు.

అందుకోసం వెయిటింగ్
మేనమామలు పవన్‌ కల్యాణ్‌, నాగబాబుతో సాయిదుర్గా తేజ్​ ఇప్పటికే యాక్ట్‌ చేశారు. ఇక మిగిలింది పెదమామ చిరంజీవినే. అయితే ఆయనతోనూ స్క్రీన్ షేర్ చేసుకోవాలనుందని దుర్గాతేజ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని మాట బయటపెట్టారు. ఆయనతో నటించే అవకాశం కోసమే ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. 'చిరంజీవి సినిమాలో నటించే అవకాశం వస్తే తప్పకుండా యాక్ట్‌ చేస్తా. ఆ అవకాశం కోసమే ఎదురుచూస్తున్నా' అని తెలిపారు.

కాగా, ఈ సినిమాలో సీనియర్ నటి త్రిష హీరోయిన్​గా నటిస్తున్నారు. ఆషికా రంగనాథ్‌, మృణాల్ ఠాకూర్, కునాల్‌ కపూర్‌, జాన్వీ కపూర్ కీలక పాత్రలు పోషించనున్నారు. డైరెక్టర్ విశిష్ఠ ఈ సినిమాను సోషియో ఫాంటసీ జానర్​లో తెరకెక్కిస్తున్నారు. దీని కోసం ఆధునిక టెక్నాలజీ వాడుతున్నారు. వీఎఫ్స్​, సీజీ వర్క్స్ ఎక్కువగా ఉండనున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ .200 కోట్ల భారీ బడ్జెట్​తో యూవీ క్రియేషన్స్ బ్యానర్​పై విక్రమ్, వంశీ, ప్రమోద్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2025 సంక్రాంతికే సినిమా విడుదల కావాల్సి ఉండగా, పలు కారణాల వల్ల ఆలస్యం అవుతోంది.

600 మందితో షూటింగ్ - భారీ సీక్వెన్స్​లో చిరు - 'విశ్వంభర'లో అదే హైలైట్​

వెంకీ డైరెక్టర్​తో చిరు మూవీ! - విశ్వంభర' తర్వాత చిరు భారీ లైనప్!

Sai Durgha Tej Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి లీడ్​ రోల్​లో నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'విశ్వంభర'. ఈ చిత్రాన్ని 'బింబిసార' ఫేమ్ వశిష్ఠ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్​ మెగా అభిమానుల్లో అంచనాలు పెంచేసింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటో కాదు, చిరు మేనల్లుడు సాయిదుర్గా తేజ్ ఈ సినిమాలో ఈ సినిమాలో భాగమైనట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్.

ఇందులో ఆయన గెస్ట్​ రోల్​లో నటిస్తున్నట్లు​ తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఆన్‌స్క్రీన్‌లోనూ హీరో (చిరంజీవి) మేనల్లుడి పాత్రలో సాయి కనిపించనున్నారని సమాచారం. ఇదే నిజమైతే మెగా ఫ్యాన్స్​కు డబుల్ ట్రీట్ అన్నట్లే. కాగా, దుర్గా తేజ్ ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కల్యాణ్​తో 'బ్రో' (BRO) సినిమాలో ఫుల్​ లెంగ్త్​లో నటించారు.

అందుకోసం వెయిటింగ్
మేనమామలు పవన్‌ కల్యాణ్‌, నాగబాబుతో సాయిదుర్గా తేజ్​ ఇప్పటికే యాక్ట్‌ చేశారు. ఇక మిగిలింది పెదమామ చిరంజీవినే. అయితే ఆయనతోనూ స్క్రీన్ షేర్ చేసుకోవాలనుందని దుర్గాతేజ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని మాట బయటపెట్టారు. ఆయనతో నటించే అవకాశం కోసమే ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. 'చిరంజీవి సినిమాలో నటించే అవకాశం వస్తే తప్పకుండా యాక్ట్‌ చేస్తా. ఆ అవకాశం కోసమే ఎదురుచూస్తున్నా' అని తెలిపారు.

కాగా, ఈ సినిమాలో సీనియర్ నటి త్రిష హీరోయిన్​గా నటిస్తున్నారు. ఆషికా రంగనాథ్‌, మృణాల్ ఠాకూర్, కునాల్‌ కపూర్‌, జాన్వీ కపూర్ కీలక పాత్రలు పోషించనున్నారు. డైరెక్టర్ విశిష్ఠ ఈ సినిమాను సోషియో ఫాంటసీ జానర్​లో తెరకెక్కిస్తున్నారు. దీని కోసం ఆధునిక టెక్నాలజీ వాడుతున్నారు. వీఎఫ్స్​, సీజీ వర్క్స్ ఎక్కువగా ఉండనున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ .200 కోట్ల భారీ బడ్జెట్​తో యూవీ క్రియేషన్స్ బ్యానర్​పై విక్రమ్, వంశీ, ప్రమోద్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2025 సంక్రాంతికే సినిమా విడుదల కావాల్సి ఉండగా, పలు కారణాల వల్ల ఆలస్యం అవుతోంది.

600 మందితో షూటింగ్ - భారీ సీక్వెన్స్​లో చిరు - 'విశ్వంభర'లో అదే హైలైట్​

వెంకీ డైరెక్టర్​తో చిరు మూవీ! - విశ్వంభర' తర్వాత చిరు భారీ లైనప్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.