ETV Bharat / state

నా చావుకు ఆమె తండ్రే కారణం - ఆత్మహత్య చేసుకునే ముందు ఓ యువకుడి లెటర్ కలకలం - SANTOSHNAGAR MAN LOVE DEATH

ఆత్మహత్యకు ముందు లెటర్​ రాసి ఉరి వేసుకున్న యువకుడు - ప్రేమించిన యువతి కుటుంబీకుల వేధింపులు భరించలేకపోయినట్లు నోట్​లో వెల్లడి

Harassment by family members
ఆత్మహత్య చేసుకున్న యువకుడు ఇమ్రాన్ (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 15, 2025, 7:55 PM IST

Harassment by Girl Family Members : ప్రేమించిన యువతి కుటుంబ సభ్యులు వేధింపులు భరించలేని ఓ యువకుడు ఏకంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంతోష్​నగర్​ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహ్మద్​ ఇమ్రాన్​ అనే యువకుడు తన చావుకు ప్రేమించిన యువతి తండ్రే కారణమంటూ ఓ నోట్ రాసి ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్న ఉదంతం చోటు చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్​లోని పాతబస్తీ సంతోష్‌నగర్ పోలీస్​ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే : పాత బస్తీలోని ఖలన్​దర్​నగర్‌కు చెందిన మహ్మద్​ ఇమ్రాన్(22), చాంద్రాయణగుట్టకు చెందిన ఓ యువతి(20) ఇద్దరూ ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ విషయం యువతి తండ్రికి తెలిసింది. గత మూడు రోజుల కింద అతను ఈ విషయంపై ఆలోచించి ఇమ్రాన్ ఇంటికి వెళ్లి మాట్లాడి కొద్ది రోజుల తర్వాత పెళ్లి విషయంపై చర్చిద్దామని చెప్పి వెళ్లిపోయాడు.

ఆమెతోనే పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు : తిరిగి ఫిబ్రవరి 14న శుక్రవారం అబిద్‌అలీ చాంద్రాయణగుట్ట పోలీస్​ స్టేషన్‌లో ఇమ్రాన్‌ తమ కూతురును వేధిస్తున్నాడని ఆమెతోనే ఫిర్యాదు ఇప్పించాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఇమ్రాన్​ను స్టేషన్​కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇంకోసారి అలా చేయవద్దని సూచించారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఇమ్రాన్ ఇంటికి వచ్చి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

నోట్ రాసి మరీ పెట్టాడు : తన మృతికి ప్రేమించిన యువతి కుటుంబీకులు, ముఖ్యంగా ఆమె తండ్రి ప్రధాన కారకుడని, అతనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతూ నోట్‌ రాసి పెట్టాడు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన సంతోష్‌నగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టామని, త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

హనుమకొండ జిల్లాలోని గోపాల్‌పూర్‌లో దారుణం - భరత్ అనే యువకుడి గొంతుకోసిన ఓ బాలిక తండ్రి

కుటుంబ కలహాలు! - ఉరి వేసుకుని ఏఆర్​ ఎస్సై ఆత్మహత్య

Harassment by Girl Family Members : ప్రేమించిన యువతి కుటుంబ సభ్యులు వేధింపులు భరించలేని ఓ యువకుడు ఏకంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంతోష్​నగర్​ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహ్మద్​ ఇమ్రాన్​ అనే యువకుడు తన చావుకు ప్రేమించిన యువతి తండ్రే కారణమంటూ ఓ నోట్ రాసి ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్న ఉదంతం చోటు చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్​లోని పాతబస్తీ సంతోష్‌నగర్ పోలీస్​ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే : పాత బస్తీలోని ఖలన్​దర్​నగర్‌కు చెందిన మహ్మద్​ ఇమ్రాన్(22), చాంద్రాయణగుట్టకు చెందిన ఓ యువతి(20) ఇద్దరూ ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ విషయం యువతి తండ్రికి తెలిసింది. గత మూడు రోజుల కింద అతను ఈ విషయంపై ఆలోచించి ఇమ్రాన్ ఇంటికి వెళ్లి మాట్లాడి కొద్ది రోజుల తర్వాత పెళ్లి విషయంపై చర్చిద్దామని చెప్పి వెళ్లిపోయాడు.

ఆమెతోనే పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు : తిరిగి ఫిబ్రవరి 14న శుక్రవారం అబిద్‌అలీ చాంద్రాయణగుట్ట పోలీస్​ స్టేషన్‌లో ఇమ్రాన్‌ తమ కూతురును వేధిస్తున్నాడని ఆమెతోనే ఫిర్యాదు ఇప్పించాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఇమ్రాన్​ను స్టేషన్​కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇంకోసారి అలా చేయవద్దని సూచించారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఇమ్రాన్ ఇంటికి వచ్చి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

నోట్ రాసి మరీ పెట్టాడు : తన మృతికి ప్రేమించిన యువతి కుటుంబీకులు, ముఖ్యంగా ఆమె తండ్రి ప్రధాన కారకుడని, అతనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతూ నోట్‌ రాసి పెట్టాడు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన సంతోష్‌నగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టామని, త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

హనుమకొండ జిల్లాలోని గోపాల్‌పూర్‌లో దారుణం - భరత్ అనే యువకుడి గొంతుకోసిన ఓ బాలిక తండ్రి

కుటుంబ కలహాలు! - ఉరి వేసుకుని ఏఆర్​ ఎస్సై ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.