న్యూయార్క్​ టైమ్స్​ స్క్వేర్స్​ బిల్​బోర్డ్​పై రామమందిర నమూనా

By

Published : Aug 5, 2020, 9:09 PM IST

Updated : Aug 5, 2020, 9:23 PM IST

thumbnail
అమెరికాలోని న్యూయార్క్​ టైమ్స్​ స్క్వేర్​ బిల్​ బోర్డ్​పై అయోధ్య రామమందిర నమూనా చిత్రాన్ని ప్రదర్శించారు. టైమ్స్​ స్క్వేర్​ ప్రాంగణంలో జై శ్రీరామ్​ నినాదం మార్మోగింది. న్యూయార్క్​ టైమ్స్​ స్క్వేర్​ బిల్​ బోర్డు ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్​ తెరల్లో ఒకటి. అయోధ్యలో బుధవారం రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేసిన సందర్భంగా.. చారిత్రక ఘట్టానికి ప్రతీకగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. భూమిపూజ వేడుకలో ప్రధాని నరేంద్ర మోదీ సహా పరిమిత సంఖ్యలో ప్రముఖులు పాల్గొన్నారు.
Last Updated : Aug 5, 2020, 9:23 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.