శిర్డీ సాయిబాబాకు వజ్రాల కిరీటం సమర్పించిన వ్యాపారి - saibaba diamond crown
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-17316906-thumbnail-3x2-saibaba.jpg)
శిర్డీ సాయిబాబాకు వజ్రాలు పొదిగిన బంగారు కిరీటాన్ని విరాళంగా ఇచ్చాడు ఓ వ్యాపారి. ఇంగ్లాండ్కు చెందిన కనారి సుబారి పటేల్ అనే భక్తుడు ఈ బంగారు కిరీటాన్ని సాయిబాబా ట్రస్టుకు అప్పగించారు. సాధారణంగా సాయిబాబాకు ఎప్పుడూ బంగారు కిరీటాలు అందుతుంటాయి. అయితే ఈసారి బాబాకు పూర్తిగా వజ్రాలు పొదిగిన కిరీటం విరాళంగా వచ్చింది. ఈ బంగారు కిరీటం బరువు 368 గ్రాములు కాగా దీని ధర రూ.28 లక్షలుగా చెబుతున్నారు. హారతి సమయంలో సాయిబాబాకు కొత్త కిరీటాలు పెడుతుంటారు. తొలినాళ్లలో బాబాకు వెండి కిరీటాలు అధికంగా వచ్చేవి. అనంతరం బంగారు కిరీటాలను దానం చేయడం పెరిగింది.
Last Updated : Feb 3, 2023, 8:37 PM IST