ETV Bharat / state

గౌతమేశ్వరస్వామి ఆలయానికి కార్తిక శోభ.. - karthika pournami celebrations in manthani

పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని గోదావరి నదికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామునే గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి నది ఒడ్డున ఉన్న గౌతమేశ్వర స్వామి ఆలయంలో కార్తిక దీపాలు వెలిగించారు.

karthika pournami celebrations at manthani
గౌతమేశ్వరస్వామి ఆలయానికి కార్తిక శోభ
author img

By

Published : Nov 30, 2020, 1:05 PM IST

పెద్దపల్లి జిల్లా మంథని పట్టణం కార్తిక శోభతో వెలుగులీనుతోంది. తెల్లవారుజాము నుంచే పట్టణం నలుమూలల నుంచి భక్తులు కుటుంబ సమేతంగా.. గోదావరి నది వద్దకు తరలివచ్చారు. కార్తిక పౌర్ణమి సందర్భంగా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, నది ఒడ్డున ఉన్న ఉసిరి చెట్టు వద్ద మహిళలు కార్తిక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించారు.

అనంతరం గౌతమేశ్వర స్వామికి అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. కార్తిక దీపాల వెలుగులతో పట్టణంలోని శివాలయాన్ని ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.