ETV Bharat / city

వేతనం ఇవ్వకపోవడం చట్ట విరుద్ధం..! - ts rtc strike breaking

వేతన చట్టం ప్రకారం... కార్మికుల వేతనం మినహాయించుకునే అధికారం ఆర్టీసీకి ఉందని హైకోర్టుకు అదనపు ఏజీ తెలిపారు. ఒక్కరోజు గైర్హాజరుకు 8 రోజుల వేతనం మినహాయించే అధికారం ఉందని పేర్కొన్నారు. కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. చేసిన పనికి వెంటనే జీతం ఇప్పించాలని కార్మిక సంఘాల తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.

payment-of-wages-is-illegal-pay-immediately
వేతనం ఇవ్వకపోవడం చట్ట విరుద్ధం..!
author img

By

Published : Nov 27, 2019, 5:38 PM IST


ఆర్టీసీ కార్మికుల వేతనాలపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. వేతన చట్టం ప్రకారం... కార్మికుల వేతనం మినహాయించుకునే అధికారం ఆర్టీసీకి ఉందని కోర్టుకు అదనపు ఏజీ తెలిపారు. ఒక్కరోజు గైర్హాజరుకు ఎనిమిది రోజుల వేతనం మినహాయించే అధికారం ఉందని పేర్కొన్నారు.

డిసెంబరు 4కు వాయిదా..!

మరోవైపు పనిచేసిన సెప్టెంబర్‌ నెల వేతనం ఇవ్వకపోవడం చట్ట విరుద్ధమని కార్మిక సంఘాల తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. చేసిన పనికి జీతం ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు. వేతనాలపై కార్మిక న్యాయస్థానానికి వెళ్లాలని.. హైకోర్టుకు కాదని అదనపు ఏజీ సూచించారు. డిసెంబరు 4న తదుపరి వాదనలు వింటామని ధర్మాసనం తెలిపింది.

వేతనం ఇవ్వకపోవడం చట్ట విరుద్ధం..!

ఇదీ చూడండి: వేతనం మినహాయించుకునే అధికారం ఆర్టీసీకి ఉంది: అదనపు ఏజీ

TG_HYD_54_27_HC_ON_RTC_WORKERS_SALARIES_AB_3064645 reporter: NAGESHWARA CHARY ( ) కార్మికులు పని చేయకపోతే.. వేతనంలో కోత విధించే అధికారం ఉంటుందని హైకోర్టుకు ఆర్టీసీ నివేదించింది. వేతనాల చెల్లింపు చట్టం ప్రకారం ఒక రోజు గైర్హాజరయితే... ఎనిమిది రోజుల వేతనం కోత విధించవచ్చునని ఆర్టీసీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ వాదించారు. ఆర్టీసీ కార్మికులు 52 రోజులుగా సమ్మె చేస్తున్నారని పేర్కొన్నారు. సెప్టెంబరు నెల వేతనం ఇచ్చేలా ఆర్టీసీని ఆదేశించాలని కోరుతూ తెలంగాణ జాతీయ మజ్దూర్ సంఘ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. పని చేసిన కాలానికి వేతనం కోత విధించే వెసులుబాటు ఏ చట్టంలోనూ లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదించారు. వేతనాలు లేక.. కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని.. కొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారన్నారు. వేతనాలపై ఏవైనా అభ్యంతరాలు, ఫిర్యాదులు ఉంటే... కార్మిక న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని.. నేరుగా హైకోర్టులో ఆశ్రయించడం చట్టవిరుద్ధమని అదనపు ఏజీ వాదించారు. గతంలోనూ పలు సందర్భాల్లో వేతనాలను డిపాజిట్ చేయాలని ధర్మాసనం ఆదేశించిందని పేర్కొన్న హైకోర్టు..డిసెంబరు 4న తదుపరి వానదలు వింటామని తెలిపింది. బైట్ చిక్కుడు ప్రభాకర్, న్యాయవాది బైట్ హన్మంతు, టీజేఎంయూ అధ్యక్షుడు END

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.