సోదరి మృతదేహాన్ని భుజంపై మోస్తూ 5కి.మీ నడక- వైద్యం అందక మృతి! - Brothers carrying sister dead body
![ETV Bharat Telugu Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telugu-1716536082.jpeg?imwidth=128)
Published : Jul 12, 2024, 12:45 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12-07-2024/640-480-21931822-thumbnail-16x9-brothers-carrying-sister-dead-body.jpg)
Brothers Carrying Sister Dead Body On Shoulder : ఉత్తర్ప్రదేశ్ లఖింపుర్ ఖేరీలో హృదయ విదారక ఘటన జరిగింది. సోదరి మృతదేహాన్ని భుజాలపై మోస్తూ సుమారు 5 కిలోమీటర్లు నడిచారు సోదరులు. భారీ వర్షాలకు రహదారులన్నీ మూసుకుపోవడం వల్ల కాలినడకన ఇంటికి చేరుకున్నారు.
ఇదీ జరిగింది!
మైలానీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లెంగంజ్ మహారాజ్ నగర్కు చెందిన 15ఏళ్ల బాలిక శివాణి, సోదరుడితో కలిసి పాలియాలో ఉంటూ చదువుకుంటోంది. ఈక్రమంలోనే రెండు రోజుల క్రితం శివాణికి టైఫాయిడ్ వచ్చింది. వైద్యులను సంప్రదించగా మెరుగైన చికిత్స కోసం పెద్ద ఆస్పత్రికి తరలించాలని సూచించారు. మరోవైపు వర్షాలకు రోడ్లన్నీ మూసుకుపోవడం వల్ల ఎటూ కదదలలేని పరిస్థితి నెలకొంది. ఈక్రమంలోనే ఆరోగ్య పరిస్థితి విషమించి శివాణి మరణించింది. దీంతో ఇద్దరు సోదరులు భూజాలపై మోస్తూ 5కిలోమీటర్లు నడిచి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. ఓ పడవ సాయంతో మృతదేహాన్ని నదిని దాటించామని, ఆ తర్వాత భుజాలపై మోస్తూ ఇంటికి తీసుకువెళ్లామని సోదరులు ఆవేదన వ్యక్తం చేశారు.