Shahrukh Khan Disaster Film : సినిమాలో ఎంతపెద్ద స్టార్లు ఉన్నా ఒక్కొసారి అది విజయం సాధించకపోవచ్చు. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించలేకపోవచ్చు. కథ బాగుంటేనే ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడతారు. అలాగే భారీగా కలెక్షన్లు వస్తాయి. ఇందుకు ఏ సినీ ఇండస్ట్రీ మినహాయింపు కాదని ఎన్నో సార్లు నిరూపితమైంది. అయితే బాలీవుడ్లో 6 ఏళ్ల క్రితం విడుదలైన ఓ చిత్రంలో అగ్రనటుడు, మరో ఇద్దరు స్టార్ కథానాయికలు ఉన్నా సినిమాను అపజయం నుంచి గట్టెక్కించలేకపోయారు. సినిమాకు పెట్టిన బడ్జెట్ను కూడా తిరిగి సాధించలేకపోయారు. ఇంతకీ ఆ సినిమా ఏది? బాక్సాఫీసు వద్ద ఎంతమేర కలెక్షన్లు సాధించింది? తదితర విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కిన సినిమా 'జీరో'. ఇందులో అనుష్క శర్మ, కత్రినా కైఫ్ హీరోయిన్లుగా నటించారు. అభయ్ దేఓల్, మాధవన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. వీరితో పాటు సల్మాన్ ఖాన్, కాజోల్, రాణి ముఖర్జీ, కరిష్మా కపూర్, జుహీ చావ్లా, అలియా భట్, దీపికా పదుకొనే, జయా బచ్చన్ వంటి నటులు అతిథి పాత్రల్లో మెరిశారు. సుమారు రూ.200 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా 2018 డిసెంబరులో థియేటర్లలో విడుదలైంది.
బడ్జెట్ను వసూలు చేయలేక విలవిల!
భారీ అంచనాల మధ్య రిలీజైన 'జీరో' ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. సినిమాలో ఉన్న భారీ తారాగణం కూడా మూవీని గట్టెక్కించలేకపోయారు. దీంతో రూ.200కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన 'జీరో' మూవీ కేవలం రూ.191కోట్లు వసూళ్లను మాత్రమే సాధించి నిరాశపర్చింది.
నాలుగేళ్లు బ్రేక్!
ఈ రిజల్ట్ వల్ల షారుక్ నుంచి నాలుగేళ్ల పాటు సినిమా రాలేదు. అయితే కొన్ని సినిమాల్లో అతిథి పాత్రలో కనిపించారు. కానీ 2023లో జవాన్ తో షారుక్ మళ్లీ ప్రేక్షకులను పలకరించారు. ఆ సినిమా బ్లాక్బస్టర్ అయ్యింది. ఆ తర్వాత షారుక్ వెనుదిరిగి చూసుకోలేదు. 'పఠాన్', 'డంకీ'లతో మళ్లీ ఫామ్లోకి వచ్చారు.
భారీగా గ్యాప్ తీసుకున్న అనుష్క
ఇదిలా ఉండగా, 'జీరో' తర్వాత అనుష్క శర్మ లాంగ్ గ్యాప్ తీసుకున్నారు. ఇప్పటివరకు ఆమె నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. కత్రినా చివరిగా 'మెర్రీ క్రిస్మస్'లో కనిపించారు.
అద్దె కట్టలేక రైల్వే ప్లాట్ ఫామ్పై నిద్ర - కట్ చేస్తే బీటౌన్లో మోస్ట్ పాపులర్ యాక్టర్గా!
20 ఏళ్ల క్రితమే స్టార్ హీరో అరుదైన ఘనత - ఒక్క ప్రాజెక్ట్కు రూ. 700 కోట్ల రెమ్యూనరేషన్!