తెలంగాణ

telangana

భారత్​ 11ఏళ్లు, సౌతాఫ్రికా 26ఏళ్లు- రెండు జట్లదీ ఒకే పరిస్థితి! - T20 World Cup 2024 Final

By ETV Bharat Telugu Team

Published : Jun 28, 2024, 10:21 PM IST

T20 World Cup 2024 Final: 2024 టీ20 వరల్డ్​కప్​లో సౌతాఫ్రికా, భారత్ ఆద్భుత ప్రదర్శనతో ఫైనల్​కు చేరాయి. బర్బాడోస్​ వేదికగా ఈ ఇరుజట్లు శనివారం టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. అయితే ఇటు భారత్, అటు సౌతాఫ్రికా రెండు జట్లు కూడా ఐసీసీ ట్రోఫీ కోసం సుదీర్ఘ కాలంగా నిరీక్షిస్తున్నాయి.

T20 World Cup 2024 Final
T20 World Cup 2024 Final (Source: Associated Press)

T20 World Cup 2024 Final:2024 టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్ ఫైట్​ భారత్- సౌతాఫ్రికా మధ్య జరగనుంది. బర్బాడోస్ వేదికగా జూన్ 29న ఈ ఫైనల్​ జరగనుంది. ఈ అవకాశం కోసం చాలా కాలంగా నిరీక్షిస్తున్నాయి. టైటిల్​కు ఒక్క అడుగు దూరంలో ఉన్న ఇరుజట్లు ఛాంపియన్​గా నిలవాలని ఆశిస్తున్నాయి. అయితే సౌతాఫ్రికా ఐసీసీ ట్రోఫీ గెలిచి దాదాపు 26ఏళ్లు కాగా, టీమ్ఇండియా 11ఏళ్ల నుంచి ఐసీసీ ఈవెంట్​లో ఛాంపియన్​గా నిలువడానికి ఎదురుచూస్తోంది.

26ఏళ్ల నుంచి సౌతాఫ్రికా వెయిటింగ్
సౌతాఫ్రికా చివరిసారి 1998 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్​ గెలిచింది. బంగ్లాదేశ్​ ఢాకా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన ఫైనల్లో సౌతాఫ్రికా 4వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ 245 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఛేజింగ్‌కి దిగిన సౌతాఫ్రికా 6 వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసింది. 37 పరుగులు, 5 వికెట్లతో అదరగొట్టిన ఆల్‌రౌండర్ జాక్వెస్‌ కలిస్‌ 'ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌'గా ఎంపికయ్యాడు.

ఇదే సౌతాఫ్రికా గెలిచిన ఏకైక ఐసీసీ టైటిల్‌ కావడం గమనార్హం. సౌతాఫ్రికా జాబితాలో ఒక్క వన్డే, టీ20 ప్రపంచకప్‌ కూడా లేదు. దాదాపు 26 ఏళ్లుగా సౌతాఫ్రికా ఐసీసీ ట్రోఫీ కోసం ఎదురు చూస్తోంది. ఈ మధ్య కాలంలో పలుమార్లు ఐసీసీ ఈవెంట్లలో సెమీస్​కు చేరినా అక్కడ సఫారీలకు నిరాశ తప్పలేదు. ఇక గతేడాది జరిగిన వన్డే వరల్డ్​కప్​లో అద్భుత ప్రదర్శనతో సౌతాఫ్రికా సెమీస్ చేరింది. కానీ, సెమీస్​లో ఆస్ట్రేలియాను ఢీకొట్టిన సౌతాఫ్రికా ఓడింది. దీంతో మరోసారి సౌతాఫ్రికా భంగపడింది. అయితే ఈసారి ఇంకో అడుగు ముందుకేసి తొలి వరల్డ్‌కప్‌ ఫైనల్ ఆడబోతోంది. ఈసారి ఎలాగైనా టైటిల్ సాధించాలని పట్టుదలతో ఉంది.

11ఏళ్లుగా టీమ్ఇండియా
2013 ఛాంపియన్స్​ ట్రోఫీ నెగ్గిన టీమ్ఇండియాకు అదే ఆఖరి ఐసీసీ టైటిల్. 2013 నుంచి టీమ్ఇండియా ఐసీసీ ట్రోఫీ కోసం ఎదురు చూస్తోంది. అప్పటి నుంచి ఐసీసీ కప్పు కోసం భారత్‌ ప్రయత్నిస్తూనే ఉంది. ఈ 11ఏళ్ల కాలంలో పలు సందర్భాల్లో ఐసీసీ ఈవెంట్లలో ఫైనల్‌ చేరినప్పటికీ తృటిలో కప్పు చేజార్చుకుంది.

ఏడాదిలో మూడోసారి
అయితే ఏడాది కాలంలో టీమ్ఇండియా మూడోసారి ఐసీసీ టోర్నీ ఫైనల్​కు చేరుకుంది. గతేడాది జరిగిన 2023 డబ్ల్యూటీసీ, 2023 వన్డే వరల్డ్​కప్​ల్లో ఫైనల్ చేరిన టీమ్ఇండియా తాజాగా పొట్టికప్​లోనూ తుదిపోరుకు అర్హత సాధించింది. గతేడాది రెండు ఫైనల్స్​లోనూ ఆస్ట్రేలియాతో పోరాడి ఓడిన భారత్, శనివారం సౌతాఫ్రికాను ఎదుర్కోనుంది. అంటే ఇప్పుడు ప్రత్యర్థి మారింది. దీంతో ప్రత్యర్థే కాదు, ఫలితం కూడా మారాలని టీమ్ఇండియా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. దశాబ్ద కాలం నిరీక్షణకు ఈ టోర్నీ విజయంతో తెర పడాలని ఆశిస్తున్నారు.

11ఏళ్లుగా టీమ్ఇండియా వెయిటింగ్- ఈసారి కప్పు పట్టేయాల్సిందే - T20 World Cup 2024

కోచ్​గా ద్రవిడ్​కు ఇదే లాస్ట్ మ్యాచ్- 17ఏళ్ల కల నెరవేరేనా? - Rahul Dravid Last Day Coach

ABOUT THE AUTHOR

...view details