తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

IRCTC సూపర్​ ప్యాకేజీ - మీనాక్షి అమ్మన్​ ఆలయంతోపాటు ఈ ప్రదేశాలు చూడొచ్చు! - ధర కూడా అందుబాటులోనే!

తమిళనాడులోని దేవాలయాలు దర్శించుకునేందుకు IRCTC టూరిజం సూపర్​ ప్యాకేజీ తీసుకొచ్చింది. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

IRCTC Treasures of Tamil Nadu Tour
IRCTC Treasures of Tamil Nadu Tour (ETV Bharat)

IRCTC Treasures of Tamil Nadu Tour:తమిళనాడులో ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలు దర్శించుకోవాలని చాలా మందికి ఉంటుంది. కానీ సరిగా ప్లాన్‌ చేసుకోలేక కొందరు.. ప్రయాణ ఛార్జీల కారణంగా మరికొందరు వెనకడుగు వేస్తుంటారు. అయితే ఇలాంటి వారి కోసమే ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) ఓ ప్యాకేజీని తీసుకొచ్చింది. మరి టూర్​ ఎలా సాగుతుంది? ఏఏ ప్రదేశాలు చూడొచ్చు? ధర ఎంత? ప్రయాణం ఎప్పుడు? వంటి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ట్రెజర్స్​ ఆఫ్​ తమిళనాడు(Treasures of Tamil Nadu) పేరుతో ఐఆర్​సీటీసీ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ టూర్​ మొత్తం 5 రాత్రులు, 6 పగళ్లు కొనసాగనుంది. ఈ టూర్​లో తమిళనాడులోని కుంభకోణం, రామేశ్వరం, మధురై, తంజావూరు వంటి ప్రముఖ ప్రాంతాలు, దేవాలయాలను సందర్శించవచ్చు.హైదరాబాద్​ నుంచి ఫ్లైట్​ జర్నీ ద్వారా ఈ ప్యాకేజీని ఆపరేట్​ చేస్తున్నారు.

ప్రయాణ వివరాలు చూస్తే..

  • మొదటి రోజు మధ్యాహ్నం హైదరాబాద్​ విమానాశ్రయం నుంచి ఫ్లైట్ జర్నీ స్టార్ట్​ అవుతుంది. సాయంత్రానికి తిరుచ్చి విమానాశ్రయం చేరుకోగా అక్కడి నుంచి పికప్​ చేసుకుని హోటల్​కు తీసుకెళ్తారు. అక్కడ చెకిన్​ అయ్యి.. ఆ రాత్రికి బస చేస్తారు.
  • రెండో రోజు బ్రేక్​ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్​ అయ్యి శ్రీరంగం ఆలయాన్ని, జంబుకేశ్వర ఆలయాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నం తంజావూరుకు వెళ్తారు. అక్కడ బృహదీశ్వర ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం కుంభకోణం వెళ్లి.. అక్కడ ఐరావతేశ్వర ఆలయాన్ని సందర్శిస్తారు. రాత్రికి కుంభకోణంలోని హోటల్​లో స్టే చేస్తారు.
  • మూడో రోజు హోటల్‌లో బ్రేక్​ఫాస్ట్ అనంతరం చిదంబరానికి బయలుదేరుతారు. అక్కడ నటరాజ స్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత గంగైకొండ చోళపురం వెళ్తారు. మధ్యాహ్నం తిరిగి కుంభకోణం చేరుకుంటారు. భోజనం అనంతరం కుంభకోణంలోని స్థానిక ఆలయాలను(కాశీ విశ్వనాథర్, సారంగపాణి, ఆది కుంభేశ్వర ఆలయం) సందర్శిస్తారు. రాత్రికి కుంభకోణంలోనే బస ఉంటుంది.
  • నాలుగో రోజు హోటల్‌లో బ్రేక్​ఫాస్ట్ తర్వాత చెక్ అవుట్ చేసి రామేశ్వరం వెళ్తారు. మధ్యాహ్నానికి రామేశ్వరం చేరుకుంటారు. హోటల్‌లో చెక్ ఇన్ చేస్తారు. ఆ తర్వాత రామనాథస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. రాత్రి రామేశ్వరంలో బస చేస్తారు.
  • ఐదో రోజు ఉదయాన్నే దనుష్కోడిని సందర్శిస్తారు. అనంతరం హోటల్‌లో బ్రేక్ ఫాస్ట్ ఉంటుంది. ఆ తర్వాత అబ్దుల్ కలాం మెమోరియల్‌ని సందర్శిస్తారు. ఆ తర్వాత మధురైకి బయలుదేరి వెళ్తారు. రాత్రికి మధురైలో బస చేస్తారు.
  • ఆరో రోజు హోటల్‌లో బ్రేక్​ఫాస్ట్ చేసిన తర్వాత మీనాక్షి అమ్మవారి దర్శనానికి వెళ్తారు. దర్శనం అనంతరం మధ్యాహ్నం మధురై ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఫ్లైట్​లో సాయంత్రానికి హైదరాబాద్ చేరుకుంటారు. దీంతో టూర్​ ముగుస్తుంది.

ధరలు చూస్తే..

  • కంఫర్ట్​లో సింగిల్​ ఆక్యూపెన్సీకి రూ.41,100, డబుల్​ ఆక్యూపెన్సీకి రూ.31,700, ట్రిపుల్​ ఆక్యూపెన్సీకి రూ.30,500గా నిర్ణయించారు.
  • ఇక 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు విత్​ బెడ్​ రూ.28,000, విత్​ అవుట్​ బెడ్​ రూ.23,850గా నిర్ణయించారు.
  • 2 నుంచి 4 సంవత్సరాల చిన్నారులకు విత్​ అవుట్​ బెడ్​తో రూ.18,050 చెల్లించాలి.

ప్యాకేజీలో ఉండేవి ఇవే:

  • విమాన టికెట్లు(హైదరాబాద్​ - తిరుచ్చి/ మధురై - హైదరాబాద్​)
  • హోటల్​ అకామిడేషన్​
  • 5 బ్రేక్​ఫాస్ట్​లు, 5 డిన్నర్​లు
  • సైట్​ సీయింగ్​ కోసం ప్యాకేజీని బట్టి వెహికల్​
  • ట్రావెల్​ ఇన్సూరెన్స్​
  • ప్రస్తుతం ఈ టూర్​ అక్టోబర్​ 22న అందుబాటులో ఉంది.
  • ఈ టూర్​కు సంబంధించిన పూర్తి వివరాలు, ప్యాకేజీ బుకింగ్​ కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

సౌత్​ ఇండియాలోని ఈ ఆలయాలు చూసొస్తారా? - వైజాగ్​ నుంచి IRCTC సూపర్​ ప్యాకేజీ! ధర కూడా అందుబాటులోనే!

కాశీ టూ నైమిశారణ్య వయా అయోధ్య - IRCTC అద్దిరిపోయే టూర్ ప్యాకేజీ!

ABOUT THE AUTHOR

...view details