Kushboo Idli Recipe in Telugu:తమిళనాడులో హీరోయిన్ ఖుష్బూకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుది కాదు. ఏకంగా ఆమె కోసం గుడి కూడా కట్టేశారంటేనే అర్థం చేసుకోవచ్చు. అయితే, తమిళనాడులో ఖుష్బూ ఎంతో ఫేమసో.. ఖుష్బూ ఇడ్లీ కూడా అంతే ఫేమస్. మెత్తగా, తెల్లగా ఉండే ఈ ఇడ్లీని సాంబార్తో తింటే అద్భుతంగా ఉంటుంది. మనం ఇంట్లో ఎప్పుడూ చేసుకునేలా కాకుండా వెరైటీగా ఖుష్బూ ఇడ్లీ ట్రై చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఖుష్బూ ఇడ్లీ, సాంబార్ను ఎలా తయారు చేసుకోవాలి? అందులోకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్ధాలు
- రెండు కప్పుల ఇడ్లీ బియ్యం
- అర కప్పు మినపప్పు
- పావు కప్పు సగ్గుబియ్యం
- రుచికి సరిపడా ఉప్పు
తయారీ విధానం
- ముందుగా బియ్యం తీసుకుని శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత మినపప్పు, సగ్గుబియ్యం కూడా ఇలానే కడిగి పక్కకు పెట్టుకోవాలి.
- ఆ తర్వాత ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసి మూత పెట్టి సుమారు 8 గంటల పాటు నానబెట్టుకోవాలి.
- అనంతరం వీటిలోని నీటిని తీసేసి తాజా నీటితో కడిగి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి.
- ఇప్పుడు ఈ పిండిని బాగా కలిపి మూత పెట్టి రాత్రంతా పులియబెట్టాలి. ఆ తర్వాత మూత తీసి ఉప్పు వేసి కలపాలి.
- ఆ తర్వాత స్టౌ ఆన్ చేసి ఈ పిండిని ఇడ్లీ పాత్రలో వేసుకుని ఉడకబెట్టుకుంటే టేస్టీ ఖుష్బూ ఇడ్లీ రెడీ!
ఇడ్లీ సాంబార్ తయారీ విధానం
మసాలా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు
- అర టీ స్పూన్ నెయ్యి
- ఒక టీ స్పూన్ శనగపప్పు
- ఒక టీ స్పూన్ మినపప్పు
- రెండు టీ స్పూన్ల ధనియాలు
- పావు టీ స్పూన్ మెంతులు
- ఒక టీ స్పూన్ జీలకర్ర
- ఐదు ఎండుమిరపకాయలు
- నాలుగు చిన్న ఉల్లిపాయలు
- పావు టీ స్పూన్ ఇంగువ
- 3 టేబుల్ స్పూన్ల తురిమిన పచ్చికొబ్బరి
- సాంబార్ చేయడానికి కావాల్సిన పదార్థాలు:
- అర కప్పు కందిపప్పు
- పావు కప్పు పెసరపప్పు
- ఒక టేబుల్ స్పూన్ బెల్లం పొడి
- ఒక టీ స్పూన్ ఉప్పు
- ఒక టేబుల్ స్పూన్ నానపెట్టిన చింతపండు
- రెండు టమాటాలు
- 2 పచ్చిమిరపకాయలు
- పావు టీ స్పూన్ పసుపు
- ఒక టీ స్పూన్ కారం
- ఒక టీ స్పూన్ నెయ్యి
- ఒక కప్పు చిన్న ఉల్లిపాయలు
- ఒక ములక్కాడ ముక్కలు
- రుచికి సరిపడా ఉప్పు
తాలింపు వేయడానికి కావాల్సిన పదార్థాలు:
- అర టీ స్పూన్ నెయ్యి
- అర టీ స్పూన్ ఆవాలు
- అర టీ స్పూన్ మినపప్పు
- అర టీ స్పూన్ జీలకర్ర
- రెండు ఎండుమిరపకాయలు
- పావు టీ స్పూన్ ఇంగువ
- 2 రెబ్బల కరివేపాకులు
తయారీ విధానం:
- ముందుగా ఒక గిన్నెలో కందిపప్పు, పెసరపప్పు వేసి నీళ్లు పోసి పది నిమిషాలు నానపెట్టుకోవాలి.
- అ తర్వాత స్టౌ ఆన్ చేసి ఒక పాన్లో నెయ్యి వేసి శననగపప్పు, మినపప్పు, ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, చిన్న ఉల్లిపాయలు, ఇంగువ, తురిమిన కొబ్బరి ఒకదాని తర్వాత ఒకటి వేసి వేయించుకోవాలి.
- ఇప్పుడు వేయించిన పదార్థాలన్నిటినీ ఒక మిక్సీలో వేసి.. బెల్లం పొడి, ఉప్పు, నానపెట్టిన చింతపండు, నీళ్లు వేసి మెత్తగా అయ్యేట్టు రుబ్బుకోవాలి.
- అనంతరం స్టౌ పైన కుక్కర్ పెట్టి అందులో నానపెట్టిన పప్పు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, పసుపు, కారం, నీళ్లు పోసి అన్నీ కలిపి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించుకోవాలి.
- మరోవైపు ఒక వెడల్పాటి కడాయిలో నెయ్యి వేసి అందులో చిన్న ఉల్లిపాయలు, తరిగిన ములక్కాడలు వేసి వేయించి కొంచెం ఉప్పు వేసి కలపాలి.
- అ తర్వాత ఇందులోనే నీళ్లు పోసి పాన్పై మూత పెట్టి పది నిమిషాలు మరిగించాలి.
- ఇప్పుడు ఇందులోనే రుబ్బుకున్న మసాలా పేస్టును వేసి కలపి ఐదు నిమిషాలు మరిగించుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమంలో ఉడికించిన పప్పుని వేసి కలిపి నీళ్లు పోయాలి.
- ఈ సమయంలోనే రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి 7 నిమిషాలు మరిగించుకుని దించేసి పక్కకుపెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌపైన ఒక చిన్న గిన్నెలో నెయ్యి వేసి అందులో ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ, కరివేపాకులు వేసి వేయించుకోవాలి.
- ఇప్పుడు స్టౌ ఆఫ్ చేసి దీనిని తాళింపును సాంబార్లో వేసి కలిపితే హోటల్ స్టైల్ ఇడ్లీ సాంబార్ రెడీ.
'గుంటూరు చికెన్ మసాలా' ఎప్పుడైనా తిన్నారా? ఇలా చేస్తే ముక్క కూడా మిగల్చరు! వెరైటీగా తినండి!!
ఆదివారం అద్దిరిపోయే మటన్ కుర్మా- ఇలా చేస్తే ఎవరైనా ఇష్టంగా తినేస్తారు! మీరు ట్రై చేయండి!!