ఫైనల్​లో టీమ్​ఇండియా ఓటమి- టీవీ పగలగొట్టి ఫ్యాన్స్​ రచ్చ - టీవీ పగలగొట్టిన ఫ్యాన్స్​ టీమ్​ఇండియా ఫ్యాన్స్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Nov 20, 2023, 7:32 AM IST

Team India Fans Broke TV : వన్డే వరల్డ్​ కప్​ ఫైనల్​లో ఆస్ట్రేలియా చేతుల్లో టీమ్​ఇండియా ఓటమి పాలవ్వడం వల్ల దేశవ్యాప్తంగా భారత్​ క్రికెట్​ జట్టు ఫ్యాన్స్ ఎంతో​ బాధపడ్డారు. కొందరు కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. అయితే ఉత్తర్​ప్రదేశ్​లోని అలీగఢ్​కు చెందిన కొందరు అభిమానులు.. టీమ్​ఇండియా ఓటిమితో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీవీని తీసుకొచ్చి రోడ్డుపై పగలగొట్టారు. భారత క్రికెట్​ జట్టుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

భారత్​ జట్టు విజయం సాధిస్తుందని అంతా అనుకున్నామని టీమ్​ఇండియా ఫ్యాన్​ ప్రదీప్​ తెలిపాడు. ఫైనల్​ మ్యాచ్​లో టీమ్​ఇండియా ఓడిపోవడం వల్ల 140 కోట్ల మంది ప్రజలు షాక్​కు గురయ్యారని చెప్పాడు. భారత్ ఓటమితో తామంతా తీవ్ర దిగ్భ్రాంతికి లోనైనట్లు పేర్కొన్నాడు. భారత్-ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా సాగిందని, అయితే టీమ్​ఇండియా గెలవలేకపోవడం దురదృష్టకరమని మరో అభిమాని సచిన్ చెప్పాడు. "ఈ టోర్నీలో మొత్తం 10 మ్యాచ్‌ల్లో భారత్ గెలిచింది. 11వ మ్యాచ్‌లో కూడా టీమ్ఇండియా గెలుస్తుందని భావించాం. కానీ అది జరగలేదు. ఆసీస్ చేతిలో భారత్​ ఓటమితో తీవ్ర నిరాశ నెలకొంది. అందుకే కోపంతో టీవీ పగలగొట్టేశాం" అని సచిన్​ తెలిపాడు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.