thumbnail

By

Published : Oct 31, 2022, 12:51 PM IST

Updated : Feb 3, 2023, 8:30 PM IST

ETV Bharat / Videos

పెట్రోల్ బంక్​లో చోరీకి యత్నించిన దుండగుడిని కాల్చి చంపిన సెక్యూరిటీ గార్డు

పంజాబ్ అమృత్​సర్​లోని మల్లియన్ పెట్రోల్ బంక్​లో చోరీకి యత్నించారు ఇద్దరు దుండగులు. తుపాకీతో పెట్రోల్ బంక్ క్యాషియర్​ను బెదిరించారు. అనంతరం అతడి వద్ద డబ్బులను తీసుకునేందుకు యత్నించారు. అప్పుడు వెంటనే పెట్రోల్ బంక్ సెక్యూరిటీ గార్డు వచ్చి దుండగులపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఒక దుండగుడు అక్కడికక్కడే మరణించాడు. మరో దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఆదివారం రాత్రి జరిగిందీ ఘటన. పెట్రోల్ బంక్​లో ఉన్న సీసీటీవీలో ఈ దృశ్యాలన్నీ రికార్డయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దుండగుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కొద్ది రోజుల క్రితం దుండగులు ఇదే పెట్రోల్ బంక్​లో చోరీకి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.