ఎంపీ VS ఎమ్మెల్యే.. చెప్పుల విషయంలో వివాదం.. రివాబా జడేజా రిప్లై ఇదే.. - rivaba jadeja poonamben maadam dispute

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 17, 2023, 9:45 PM IST

Rivaba Jadeja Poonamben Maadam Dispute : గుజరాత్.. జామ్​నగర్ నార్త్​ బీజేపీ ఎమ్మెల్యే రివాబా జడేజా, ఎంపీ పూనంబెన్​ మధ్య వాగ్వాదం జరిగింది. అమరవీరులకు నివాళులర్పించే కార్యక్రమంలో పాల్గొన్న వీరిద్దరూ గొడవకు దిగారు. రివాబా చెప్పులు విప్పి.. అమరవీరులకు నివాళులర్పించడంపై ఎంపీ పూనంబెన్ విమర్శించారు. ప్రధాని, రాష్ట్రపతి కూడా చెప్పులు విప్పి నివాళులర్పించని అన్నారు. ఈ క్రమంలో పూనంబెన్​పై రివాబా అసంతృప్తి వ్యక్తం చేశారు.  

'ఎంపీ పూనంబెన్‌ అమరవీరులకు చెప్పులు వేసుకుని నివాళులర్పించారు. నేను చెప్పులు విప్పి అమరవీరులకు నివాళులర్పించాను. అలాంటి కార్యక్రమాల్లో ప్రధాని, రాష్ట్రపతి కూడా చెప్పులు తీయరని.. కొందరు అమాయకులు మాత్రమే చెప్పులు తీసి నివాళులర్పిస్తారని పూనంబెన్​ అన్నారు. ఆమె వ్యాఖ్యలు నాకు నచ్చలేదు. అందుకే ఆత్మగౌరవంతో మాట్లాడాను. చెప్పులు విప్పి నివాళులర్పించి నేను తప్పు చేశానా?' అని జామ్​నగర్ నార్త్ ఎమ్మెల్యే రివాబా జడేజా అన్నారు.
గతేడాది జరిగిన గుజరాత్​ ఎన్నికల్లో రవీంద్ర జడేజా సతీమణి రివాబా భారీ ఆధిక్యంతో గెలుపొందారు. జామ్​నగర్​ నార్త్​లో బీజేపీ తరపున పోటీ చేసిన రివాబా.. సమీప ప్రత్యర్థి ఆప్​కు చెందిన కర్షన్ కర్మూర్​పాపై 61వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.