కాలువలోకి దూసుకెళ్లిన కారు- ఐదుగురు మృతి, అంతా బంధువులే! - కాలువలోకి దూసుకుపోయిన కారు వీడియో
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-11-2023/640-480-19972374-thumbnail-16x9-eoeoe.jpg)
![ETV Bharat Telugu Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telugu-1716536082.jpeg)
Published : Nov 8, 2023, 12:36 PM IST
Karnataka Car Accident : అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది ఓ కారు. ఈ ఘటనలో నీట మునిగి ఐదుగురు మరణించారు. మృతులంతా బంధువులేనని పోలీసులు తెలిపారు. కర్ణాటకలోని మండ్య జిల్లాలో ఈ ఘోర ప్రమాదం జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైసూరు నుంచి తుమకూరు వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి విశ్వేశ్వరాయ కాలువలోకి దూసుకుపోయింది. గమనించిన స్థానికులు.. వెంటనే పోలీసులకు సమచారం అందించారు. హుటాహుటిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
లైఫ్ బోట్లతో కాలువలోకి రెస్క్యూ ఆపరేషన్ను సహాయక బృందాలు నిర్వహించాయి. అప్పటికే కారులోని ఐదుగురు కూడా చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. మృతులంతా బంధువులే అని చెప్పారు. వీరంతా మైసూరులో ఓ వేడుకకు హాజరై.. తిరుగు ప్రయాణమయ్యారని పోలీసులు వెల్లడించారు. నిద్రమత్తే ప్రమాదానికి కారణమై ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.
వంతెనపై నుంచి..
మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లాలో వంతెనపై నుంచి అదుపుతప్పి ట్రాక్పై వెళ్తున్న గూడ్స్ ట్రైన్పై పడిపోయింది ఓ కారు. రైలును ఢీకొట్టడం వల్ల కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ వీడియో చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.