thumbnail

టోల్​ సిబ్బందిపై భాజపా నేత దాడి.. తుపాకీతో హల్​చల్​!

By

Published : May 21, 2022, 7:52 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

టోల్​ టాక్స్​ అడిగినందుకు సిబ్బందిపై దాడి చేశారు భాజపా నేత తిలక్​ యాదవ్, ఆయన​ మద్దతుదారులు. ఈ సంఘటన ఉత్తర్​ప్రదేశ్​, ఝాన్సీ జిల్లాలోని శివపురి రహదారిపై ఉన్న రక్షా టోల్​ ప్లాజా వద్ద గురువారం రాత్రి జరిగింది. భాజపా యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు తిలక్​ యాదవ్ ఓ వివాహ వేడుకకు హాజరై వస్తుండగా టోల్​ప్లాజా సిబ్బంది ట్యాక్స్​ చెల్లించాలని చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన తిలక్​​, ఆయన అనుచరులు దాడికి దిగారు. సామగ్రి ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా లైసెన్స్ తుపాకులతో కాల్పులు జరిపి భయపెట్టారు. దీంతో​ సిబ్బంది పరుగులు పెట్టారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సమస్యను అదుపులోకి తీసుకొచ్చారు. సీసీటీవీ కెమెరాల్లో నమోదైన ఈ దృశ్యాలు వైరల్​గా మారాయి. భాజపా నేత సహా మొత్తం 30 మందిపై శుక్రవారం సాయంత్రం ఎఫ్​ఐఆర్ నమోదు చేశారు రక్షా పోలీసులు. భాజపా నేత మద్దతుదారులు టోల్​ ప్లాజాలో నగదు ఎత్తుకెళ్లినట్లు ఆరోపించారు సిబ్బంది.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.