Gurupurnami Celebrations At Shirdi : షిర్డీలో వైభవంగా ముగిసిన గురుపౌర్ణమి వేడుకలు..

By

Published : Jul 4, 2023, 4:27 PM IST

thumbnail

Gurupurnami celebrations 2023 at Shirdi Saibaba Temple : షిర్డీ సాయి మందిరంలో గురుపౌర్ణమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మూడురోజుల పాటు సాగిన ఈ ఉత్సవాలు ఇవాళ్టితో ముగించారు. ఈ రోజు కార్యక్రమంలో భాగంగా కాళీయ కీర్తన అనంతరం దహిహండీని పగులగొట్టి గురు పౌర్ణమి ఉత్సవాన్ని ముగించారు. ఉత్సవాలు చివరి రోజు కావడంతో ఉదయం సాయిమూర్తి, సమాధి స్నానాలు చేసి సప్నిక్ గురుస్థాన్ ఆలయంలో సాయిబాబా సంస్థాన్ కార్యనిర్వహణాధికారి మహారుద్రాభిషేకం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో సాయి కీర్తనలు భక్తులు నిర్వహించారు. కాళీ కీర్తనకు గ్రామస్థులు, సాయి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. భక్తులు జిమ్మా, ఫుగాడి ఆడుతూ కీర్తనలు పగలగొట్టి దహీ హండీని ఆడుతూ మధ్యాహ్న హారతి నిర్వహించి ఉత్సవాలను ముగించారు. ఈ మూడు రోజుల్లో సుమారు 3లక్షల మంది భక్తులు సాయిచరణిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు పేర్కొన్నారు. మరోవైపు ఈసారి భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయ అధికారులు తగు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.