బ్రెజిల్ వరదల్లో 46 మంది ఆచూకీ గల్లంతు
బ్రెజిల్ను భారీ వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి. వరద ప్రవాహానికి తోడు కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటివరకు 32 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 46 మంది ఆచూకీ గల్లంతైంది. తప్పిపోయిన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పరీవాహక ప్రాంతాల్లోని వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. 400 మంది నిరాశ్రయులయ్యారు.