thumbnail

ఉగ్రదాడి మృతులకు ఘన నివాళి

By

Published : Mar 16, 2019, 10:01 AM IST

న్యూజిలాండ్​లోని క్రైస్ట్​చర్చ్, లిన్​మోర్ మసీదుల్లో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన 49 మందికి ​దేశ ప్రజలు నివాళులర్పించారు. క్రైస్ట్​చర్చ్​ ఆసుపత్రి సమీపంలోని ఉద్యానవనంలో అధికారికంగా నివాళి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇక్కడికి చేరుకున్న వందలాది మంది పుష్పాలు, సందేశాలతో సంఘీభావం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ ఘటనలో గాయపడ్డ 48 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.