thumbnail

By

Published : Nov 17, 2021, 1:27 PM IST

Updated : Nov 17, 2021, 2:54 PM IST

ETV Bharat / Videos

Live video: అకస్మాత్తుగా కారు డోర్ ఓపెన్​.. బైక్​పై ఉన్న వ్యక్తి క్షణాల్లోనే...

మహారాష్ట్ర, ఫుణెలోని పింపరీ చించవాడలో ఒళ్లు గగుర్పొడిచే రీతిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు డ్రైవర్, ద్విచక్రవాహనదారుడి నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. ​రాంగ్​ రూట్లో కారు నిలపటమే కాకుండా.. అకస్మాత్తుగా డోర్​ తెరిచాడు డ్రైవర్. అదే సమయంలో రాంగ్​ రూట్లో కారును దాటేందుకు ప్రయత్నిస్తూ.. డోరు తగిలి ఎదురుగా వస్తున్న లారీకింద పడింది బైక్​. ట్రక్కు టైర్​ ఎక్కటం వల్ల ద్విచక్రవాహనంపై వెనక కూర్చున్న రామ్​ బలాసాహెబ్​ బగల్​(24) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్​ నడుపుతున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన నవంబర్​ 11న మధ్యహ్నం 1.30 గంటలకు జరిగింది. సీసీటీవీలో ఈ ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి. ట్రక్కు, కారు డ్రైవర్లతో పాటు ద్విచక్రవాహనదారునిపైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
Last Updated : Nov 17, 2021, 2:54 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.