ప్రపంచ సాగర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ సైకత కళాకారుడు సుదర్శన్ పట్నాయక్(Sudarshan Patnaik ) వినూత్నంగా సందేశం ఇచ్చారు. సముద్రాలను కాలుష్యం నుంచి రక్షించుకోవాలని ఒడిశాలోని పూరీ తీరంలో సైకత శిల్పం(Sand Art) తయారు చేశారు. కాలుష్య రహిత సముద్రాలతో అంతరించిపోతున్న జీవరాశిని రక్షించుకోవాలని తెలిపేలా కళాఖండాన్ని రూపొందించారు. సైకత శిల్పంతో సాగరాల పరిరక్షణపై ప్రజల్లో అవగాహన తీసుకువచ్చేందుకు ఇలా చేశానని తెలిపారు సుదర్శన్ పట్నాయక్.