వృద్ధ యాచకులపై కానిస్టేబుల్ దాడి- వీడియో వైరల్!
రాజస్థాన్ నాగౌర్ జిల్లాలోని మక్రానా రైల్వే స్టేషన్లో అమానవీయ ఘటన జరిగింది. ఇద్దరు వృద్ధ యాచకులపై పోలీస్ కానిస్టేబుల్ దాడి చేశాడు. బూటు కాలుతో వృద్ధున్ని తంతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. రైల్వే ప్రయాణికులకు సంబంధించిన ఆహారం విషయంలో యాచకులు ఏదో ఇబ్బంది కలిగిస్తున్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు.