రూ.10 పందెం కోసం ప్రాణాల మీదకు..!

By

Published : Aug 10, 2021, 4:43 PM IST

thumbnail
మధ్యప్రదేశ్​లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చాలా ప్రాంతాల్లో నదులు, వాగులు పొంగిపొర్లి ప్రమాదకరంగా మారాయి. వాగు దాటడం ప్రమాదం అని హెచ్చరిస్తున్నా కొందరు దుస్సాహసాలకు పోయి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సతనా జిల్లా పరసమానియా గ్రామంలో రూ.10 పందెం కోసం దుస్సాహసానికి ఒడిగట్టిన యువకులకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. ప్రమాదరకరంగా ప్రవహిస్తున్న వాగును బైక్​పై దాటేందుకు యత్నించగా.. ఆ వాహనం వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. దీంతో సూమారు రూ.70వేలు విలువ చేసే బైక్​ నీటిపాలైంది. అదృష్టవశాత్తు యువకులు ప్రాణాలతో బయటపడ్డారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.