హైవేపై తగలబడిన ట్రక్కులు-డ్రైవర్ మృతి - పర్దీలో రోడ్డు ప్రమాదం
🎬 Watch Now: Feature Video

గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ట్రక్కులు వేగంగా ఒకదానిని మరొకటి ఢీ కొట్టడం వల్ల డ్రైవర్ మరణించాడు. ఈ ఘటన వల్సాద్ జిల్లాలోని ముంబయి-అహ్మదాబాద్ హైవేపై పర్ది అనే ప్రాంతంలో జరిగింది. ట్రక్కలు ఢీ కొనడం కారణంగా భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. ఎంతకీ అదుపులోకి రాకపోవడంతో మరో రెండు అగ్నిమాపక యంత్రాలను పిలిచినట్లు అధికారులు తెలిపారు.