ETV Bharat / state

IAS SRILAXMI: ఐఏఎస్ శ్రీలక్ష్మీపై కఠిన చర్యలొద్దు: తెలంగాణ హైకోర్టు - ఐఏఎస్ శ్రీలక్ష్మి తాజా వార్తలు

ఓఎంసీ కేసులో (omc case) ఏపీకి చెందిన ఐఏఎస్​ శ్రీలక్ష్మిపై కఠిన చర్యలు తీసుకోవద్దని సీబీఐ (cbi) కోర్టుకు రాష్ట్ర హైకోర్టు (ts high court) మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో చార్జిషీట్​పై విచారణ ఆపాలన్న శ్రీలక్షి పిటిషన్​పై హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది.

IAS, srilaxmi
శ్రీలక్ష్మి
author img

By

Published : Jul 9, 2021, 4:22 PM IST

ఓబుళాపురం గనుల కేసు (obulapuram mining company case)లో చార్జిషీట్​పై విచారణ ఆపాలన్న ఏపీ ఐఏఎస్ అధికారి శ్రీలక్షి (ias sri laxmi) పిటిషన్​పై తెలంగాణ హైకోర్టులో (ts high court) విచారణ జరిగింది. సరిహద్దు వివాదంపై దర్యాప్తు పూర్తయ్యే వరకు విచారణ ఆపాలని ఆమె తరఫు న్యాయవాది కోరారు.

ఓఎంసీ కేసు దర్యాప్తు పూర్తయిందని మరో చార్జిషీట్ వేయబోమని సీబీఐ (cbi) న్యాయస్థానానికి తెలిపింది. దర్యాప్తు అధికారి వాంగ్మూలాన్ని సీబీఐ కోర్టు ఇప్పటికే పరిగణనలోకి తీసుకుందన్నారు. వాదనలు వినిపించనందుకు సీబీఐ కోర్టు ఇప్పటికే రూ.4వేలు జరిమానా విధించిందన్న శ్రీలక్ష్మి.. ఈనెల 12న వాదించకపోతే డిశ్చార్జి పిటిషన్​పై నిర్ణయం తీసుకుంటామని సీబీఐ కోర్టు తెలిపిందన్నారు. వాదనలు విన్న న్యాయస్థానం శ్రీలక్ష్మిపై కఠిన చర్యలు తీసుకోవద్దని సీబీఐ కోర్టుకు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.