- అంబులెన్స్ల నిలిపివేత...
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం సమీపంలోని రామాపురం చెక్పోస్ట్ వద్ద అనుమతి లేని ఏపీ అంబులెన్స్లను పోలీసులు నిలిపివేశారు. రాష్ట్రంలోకి వచ్చే కొవిడ్ అంబులెన్స్ల వద్ద ఆస్పత్రుల లేఖతో పాటు కరోనా కంట్రోల్ రూమ్ పాసులు తప్పనిసరిగా ఉండాలని, అలా అయితేనే అనుమతిస్తామని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మరో 3.43 లక్షల కేసులు, 4వేల మరణాలు
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గురువారం మరో 3,43,144 మంది వైరస్ బారినపడ్డారు. కొవిడ్ కారణంగా మరో 4వేల మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఇప్పటివరకు ఎన్ని వ్యాక్సిన్లు వేశారంటే?...
తెలంగాణలో ఇప్పటివరకు 43,75,396 మందికి కరోనా టీకా మొదటి డోస్ వేశారు. 11,03,872 మందికి రెండో డోస్ వాక్సినేషన్ పూర్తైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అమల్లోకి లాక్డౌన్...
తెలంగాణలో మూడో రోజు పటిష్ఠంగా లాక్డౌన్ అమలవుతోంది. వెసులుబాటు కల్పించిన 4 గంటల సమయంలో మార్కెట్లు జనసమ్మర్ధంగా మారాయి. మరోవైపు వలసకూలీలు సొంతూళ్లకు వెళ్లేందుకు బస్టాండ్లలో బారులు తీరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- యువతిపై 25మంది అత్యాచారం..
హరియాణలో దారుణ ఘటన వెలుగుచూసింది. పల్వాల్ జిల్లాలో యువతిపై 25మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- చిన్నారులకు కరోనా సోకితే?...
కరోనా కొత్త స్ట్రెయిన్ వల్ల పెద్దవారితో పాటు చిన్నారులూ వైరస్ బాధితులుగా మారిపోతున్నారు. అయితే.. పిల్లలకు కొవిడ్ సోకినా.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు హైదరాబాద్లోని రెయిన్బో పిల్లల ఆస్పత్రి వైద్యులు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రజలకు మోదీ శుభాకాంక్షలు...
ఈద్ ఉల్ ఫితర్, అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ. కలిసికట్టుగా మహమ్మారిని జయించాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నష్టాల్లో మార్కెట్లు...
వారాంతపు సెషన్లోనూ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఆరంభంలో లాభాలను నమోదు చేసిన సూచీలు కొద్ది సేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 60 పాయింట్లకుపైగా నష్టంతో 48,625 వద్ద ట్రేడవుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- క్రికెటర్ల భార్యలు ఏం చేస్తుంటారో తెలుసా?...
క్రికెట్.. భారత్లో ఆట మాత్రమే కాదు ఓ మతం. ఆటను ఎంతగా అభిమానిస్తారో, ఆటగాళ్లను అంతకుమించి ఆరాధిస్తారు. మ్యాచ్ జరుగుతుంటే కోట్లాది మంది వారికి మద్దతుగా నిలుస్తారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'షాంఘై'కి సూర్య 'ఆకాశం నీ హద్దురా'...
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన 'సూరారై పోట్రు' అరుదైన ఘనత సాధించింది. షాంఘై అంతర్జాతీయ చలన చిత్రోత్సవం-2021 వేడుకల్లో పనోరమ విభాగంలో అర్హత సాధించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.