ETV Bharat / city

తెలుగుదేశం మహానాడు.. వర్చువల్ సమావేశాలకు సిద్ధం

author img

By

Published : May 26, 2021, 10:02 AM IST

రేపటి నుంచి రెండ్రోజుల పాటు జరిగే తెలుగుదేశం వర్చువల్‌ మహానాడుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కరోనా కారణంగా గతేడాది మాదిరే.. ఈసారీ వర్చువల్‌గా వేడుకను నిర్వహించనున్నారు. కార్యక్రమంలో చర్చించాల్సిన ఎజెండాను ఇప్పటికే తెదేపా అధినేత చంద్రబాబు ఖరారు చేశారు. మొత్తం 15 తీర్మానాలను ఈ రెండ్రోజుల వేడుకలో ప్రవేశపెట్టనున్నారు. రోజుకు దాదాపు ఆరు గంటలు చొప్పున మొత్తం 12 గంటలు పాటు మహానాడు జరిగేలా ప్రణాళిక సిద్ధం చేశారు.

tdp mahanadu
తెలుగుదేశం మహానాడు.

తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీకి అతిపెద్ద పండుగైన మహానాడు నిర్వహణకు ఆ పార్టీ సిద్ధమైంది. కొవిడ్‌ విజృంభణతో ఈ నెల 26, 27 నుంచి రెండ్రోజుల పాటు ఆన్‌లైన్‌ వేదికగానే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రెండు రోజులూ ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు, మళ్లీ మధ్యాహ్నం మూడున్నర నుంచి ఆరు గంటల వరకు నిర్వహిస్తారు. గత సంవత్సరం పార్టీ అధినేత చంద్రబాబు సహా, ముఖ్య నేతలు ఆరేడుగురు మంగళగిరి సమీపంలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వర్చువల్‌ మహానాడులో పాల్గొన్నారు. ఈసారి కరోనా వ్యాప్తి మరింత ఉద్ధృతంగా ఉండటం, ఉభయ రాష్ట్రాల్లోనూ ఆంక్షలు అమల్లో ఉన్న నేపథ్యంలో చంద్రబాబు హైదరాబాద్‌లోని తన నివాసం నుంచే మహానాడులో పాల్గొంటారు. మిగతా నాయకులు కూడా ఎక్కడివారు అక్కడి నుంచే కార్యక్రమంలో భాగస్వాములవుతారు. వేడుకలో చేపట్టాల్సిన తీర్మానాలు, చర్చించాల్సిన అంశాలపై ప్రణాళికను పార్టీ నేతలతో ఇప్పటికే అధినేత చంద్రబాబు చర్చించారు. సంతాప, రాజకీయ తీర్మానాలు, పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కి నివాళితో పాటు, మరో 13 అంశాలపై తీర్మానాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన ప్రజా సమస్యలపై ఎనిమిది, తెలంగాణకు సంబంధించి ఐదు తీర్మానాలు ప్రవేశపెడతారు.

తెలుగుదేశం మహానాడు.

అధ్యక్షుడి ప్రసంగంతో మొదలు:

తొలి రోజు చంద్రబాబు ప్రారంభోపన్యాసంతో కార్యక్రమం మొదలవుతుంది. అనంతరం ఏడాది కాలంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మరణించిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు నివాళులర్పించి, సంతాప తీర్మానం ప్రవేశపెడతారు. తొలి రోజు రాష్ట్రానికి సంబంధించి.. 'కొవిడ్‌ కట్టడిలో తీవ్ర వైఫల్యాలు - తలకిందులైన కుటుంబ ఆదాయం', 'రాష్ట్ర ఉగ్రవాదం - చట్టాలకు విఘాతం- ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు', 'అదుపులేని ధరలు- పెంచిన పన్నులు - అప్పులు', 'పరిశ్రమలపై దాడులు - అమరావతి సంపద విధ్వంసం - పెరుగుతున్న నిరుద్యోగం' అన్న అంశాలపై తీర్మానాలు ప్రవేశపెడతారు. తొలి రోజు తెలంగాణకు సంబంధించి రెండు తీర్మానాలు ఉంటాయి.

రాష్ట్రానికి సంబంధించి మూడు తీర్మానాలు:

రెండో రోజు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్​ జయంతి సందర్భంగా.. చంద్రబాబు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ను సందర్శించి నివాళులర్పిస్తారు. అనంతరం 'ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీక - సామాజిక న్యాయ ప్రదాత ఎన్టీఆర్‌' అనే అంశంపై మహానాడులో తీర్మానం ప్రవేశపెట్టి, ఆయనకు నివాళులర్పిస్తారు. తర్వాత ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి 'నత్తనడకలో సాగునీటి ప్రాజెక్టులు - కుదేలైన వ్యవసాయం', 'మోసకారి సంక్షేమం - నకిలీ రత్నాలు' అన్న అంశాలపై తీర్మానాలు ఉంటాయి. రెండో రోజు తెలంగాణకు సంబంధించి మూడు తీర్మానాలు ప్రవేశపెడతారు. రాజకీయ తీర్మానాన్ని యనమల రామకృష్ణుడు ప్రవేశపెడతారు. చంద్రబాబు ప్రసంగంతో రెండు రోజుల మహానాడు ముగుస్తుంది.

ఇదీ చదవండి: పండగ పేరుతో రైల్వే బాదుడు.. వలస కార్మికులపై అదనపు ఛార్జీలు

తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీకి అతిపెద్ద పండుగైన మహానాడు నిర్వహణకు ఆ పార్టీ సిద్ధమైంది. కొవిడ్‌ విజృంభణతో ఈ నెల 26, 27 నుంచి రెండ్రోజుల పాటు ఆన్‌లైన్‌ వేదికగానే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రెండు రోజులూ ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు, మళ్లీ మధ్యాహ్నం మూడున్నర నుంచి ఆరు గంటల వరకు నిర్వహిస్తారు. గత సంవత్సరం పార్టీ అధినేత చంద్రబాబు సహా, ముఖ్య నేతలు ఆరేడుగురు మంగళగిరి సమీపంలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వర్చువల్‌ మహానాడులో పాల్గొన్నారు. ఈసారి కరోనా వ్యాప్తి మరింత ఉద్ధృతంగా ఉండటం, ఉభయ రాష్ట్రాల్లోనూ ఆంక్షలు అమల్లో ఉన్న నేపథ్యంలో చంద్రబాబు హైదరాబాద్‌లోని తన నివాసం నుంచే మహానాడులో పాల్గొంటారు. మిగతా నాయకులు కూడా ఎక్కడివారు అక్కడి నుంచే కార్యక్రమంలో భాగస్వాములవుతారు. వేడుకలో చేపట్టాల్సిన తీర్మానాలు, చర్చించాల్సిన అంశాలపై ప్రణాళికను పార్టీ నేతలతో ఇప్పటికే అధినేత చంద్రబాబు చర్చించారు. సంతాప, రాజకీయ తీర్మానాలు, పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కి నివాళితో పాటు, మరో 13 అంశాలపై తీర్మానాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన ప్రజా సమస్యలపై ఎనిమిది, తెలంగాణకు సంబంధించి ఐదు తీర్మానాలు ప్రవేశపెడతారు.

తెలుగుదేశం మహానాడు.

అధ్యక్షుడి ప్రసంగంతో మొదలు:

తొలి రోజు చంద్రబాబు ప్రారంభోపన్యాసంతో కార్యక్రమం మొదలవుతుంది. అనంతరం ఏడాది కాలంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మరణించిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు నివాళులర్పించి, సంతాప తీర్మానం ప్రవేశపెడతారు. తొలి రోజు రాష్ట్రానికి సంబంధించి.. 'కొవిడ్‌ కట్టడిలో తీవ్ర వైఫల్యాలు - తలకిందులైన కుటుంబ ఆదాయం', 'రాష్ట్ర ఉగ్రవాదం - చట్టాలకు విఘాతం- ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు', 'అదుపులేని ధరలు- పెంచిన పన్నులు - అప్పులు', 'పరిశ్రమలపై దాడులు - అమరావతి సంపద విధ్వంసం - పెరుగుతున్న నిరుద్యోగం' అన్న అంశాలపై తీర్మానాలు ప్రవేశపెడతారు. తొలి రోజు తెలంగాణకు సంబంధించి రెండు తీర్మానాలు ఉంటాయి.

రాష్ట్రానికి సంబంధించి మూడు తీర్మానాలు:

రెండో రోజు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్​ జయంతి సందర్భంగా.. చంద్రబాబు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ను సందర్శించి నివాళులర్పిస్తారు. అనంతరం 'ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీక - సామాజిక న్యాయ ప్రదాత ఎన్టీఆర్‌' అనే అంశంపై మహానాడులో తీర్మానం ప్రవేశపెట్టి, ఆయనకు నివాళులర్పిస్తారు. తర్వాత ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి 'నత్తనడకలో సాగునీటి ప్రాజెక్టులు - కుదేలైన వ్యవసాయం', 'మోసకారి సంక్షేమం - నకిలీ రత్నాలు' అన్న అంశాలపై తీర్మానాలు ఉంటాయి. రెండో రోజు తెలంగాణకు సంబంధించి మూడు తీర్మానాలు ప్రవేశపెడతారు. రాజకీయ తీర్మానాన్ని యనమల రామకృష్ణుడు ప్రవేశపెడతారు. చంద్రబాబు ప్రసంగంతో రెండు రోజుల మహానాడు ముగుస్తుంది.

ఇదీ చదవండి: పండగ పేరుతో రైల్వే బాదుడు.. వలస కార్మికులపై అదనపు ఛార్జీలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.