thumbnail

By

Published : Oct 24, 2021, 5:03 PM IST

ETV Bharat / Videos

గొర్రెల కోసం వచ్చి ఇంట్లో దూరిన చిరుత

కర్ణాటకలో ఓ ఇంట్లోకి ప్రవేశించిన చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారుల బృందం ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టింది. జలమంగళ గ్రామంలోని నాగరాజు ఇంట్లో ఉన్న గొర్రెలు, కుక్కల కోసం వచ్చిన చిరుత అనుకోకుండా ఇంట్లోకి దూరింది. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు బయటనుంచి తలుపులు వేశారు. సమాచారం అందుకున్న రామనగర అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని.. మత్తుమందు ఇచ్చి చిరుతను బంధించారు. గత నెల రోజులుగా తమను భయబ్రాంతులకు గురిచేస్తున్న చిరుతను బంధించటం వల్ల గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.