LIVE : సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ - ప్రత్యక్షప్రసారం - TELANGANA THALLI STATUE UNVEILING
🎬 Watch Now: Feature Video
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Dec 9, 2024, 5:56 PM IST
|Updated : Dec 9, 2024, 7:28 PM IST
CM Revanth unveiled Telangana Thalli Statue LIVE : కొత్త రూపురేఖలతో సిద్ధమైనటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని రాష్ట్ర సచివాలయం ప్రాంగణంలో సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తున్నారు. సుమారు నెలన్నర రోజులు శ్రమించి దాదాపు 100 మంది కళాకారులు సుమారు 8 వేల కిలోల బరువుతో కాంస్య విగ్రహాన్ని తయారు చేశారు. సచివాలయం ప్రధాన ద్వారం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సుమారు 3 కోట్ల రూపాయలతో విగ్రహం ఎదురుగా రోడ్డుపై మూసేసిన గేటు వరకు వాటర్ ఫౌంటెయిన్, చుట్టుపక్కల పచ్చటి బయళ్లు, లైటింగ్ను సిద్ధం చేశారు. అభయహస్తం బిగించిన కొంగు చేతిలో పంటలు, బంగారు రంగు అంచు ఉన్న పచ్చటి చీరతో కూడిన తెలంగాణ తల్లి విగ్రహం 17 అడుగులు కాగా బిగించిన పిడికిళ్లు చేతులతో నిలబెట్టుకుంటున్న సంకేతంతో మూడడగుల గద్దెతో కలిపి మొత్తం 20 అడుగుల విగ్రహం సిద్ధమైంది. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమాని రాష్ట్రం నలుమూలల నుంచి మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం.
Last Updated : Dec 9, 2024, 7:28 PM IST