స్పెషల్ అట్రాక్షన్​గా బిహార్​ 'గోల్డ్ మ్యాన్' బుల్లెట్- అంతా బంగారమే! - Gold Man Of Bihar

By ETV Bharat Telugu Team

Published : Jun 30, 2024, 3:07 PM IST

thumbnail
Bihar Gold Man Bullet (ETV Bharat)

Bihar Gold Man Bullet : బంగారంపై ఉన్న ఆసక్తితో బిహార్​ గోల్డ్ మ్యాన్​గా ఫేమస్​ అయిన భోజ్​పుర్​కు చెందిన ప్రేమ్​సింగ్ మరోసారి వార్తల్లో నిలిచారు. శరీరంపైనే కాకుండా తాను తిరిగే బైక్​ను కూడా బంగారు పూతతో తయారు చేయించారు. బైక్​లోని కొన్ని భాగాలకు సుమారు 200 గ్రాముల బంగారంతో పూత పూయించినట్లు ప్రేమ్​సింగ్ చెప్పారు.

 ''బుల్లెట్ మొత్తం బంగారు పూతతో చేయలేదు. కొన్ని భాగాలకు మాత్రమే బంగారు పూత ఉంటుంది. అందుకోసం 150-200 గ్రాముల బంగారు ఉపయోగించాం. దీని ధర రూ.11 నుంచి రూ.12 లక్షల వరకు ఉంటుంది. ఈ బుల్లెట్​ను బెంగుళూరులో తయారు చేయించాం. అందుకు ఏడు నుంచి ఎనిమిది నెలలు సమయం పట్టింది''  

- ప్రేమ్​సింగ్, బిహార్ గోల్డ్ మ్యాన్

'నేను ధరించే నగలు మాత్రమే కాకుండా కళ్లద్దాలు, మొబైల్​ కవర్ ఇలా చాలా వస్తువులు బంగారంతో చేసినవే ఉంటాయి. మొత్తం 5కేజీల పైనే విలువైన బంగారం ఉంటుంది. నేను బయటకు వెళ్లిన నాకు ఎలాంటి భద్రతపరమైన ఇబ్బందులు లేవు' అని ప్రేమ్​సింగ్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.