తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతులకు గుడ్​ న్యూస్, మరో 4 లక్షల మందికి రుణమాఫీ - ఎప్పుడంటే ?

రాష్ట్రంలోని రైతులకు శుభవార్త - మరో 4 లక్షల మంది రైతులకు రుణమాఫీ - ప్రకటించిన మంత్రి సీతక్క - రుణమాఫీ ఎప్పుడంటే ?

LOAN WAIVER SCHEME IN TELANGANA
Minister Seethakka About Rythu Runa Mafi (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 5 hours ago

Minister Seethakka About Rythu Runa Mafi : ఇప్పటికే గత రెండు మూడు నెలల్లో 25 లక్షల మంది రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేశామని, దీపావళి తర్వాత మరో నాలుగు లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలోని పర్యటించిన ఆమె, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతాల్లో సాగు చేసుకుంటున్న గిరిజన రైతుల భూములకు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. రైతులు ఎవరు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని పేర్కొన్నారు.

భూమి పట్టాలు చేయిస్తామంటూ దళారులు వస్తున్నారని, ఎవరిని నమ్మొద్దని మంత్రి సీతక్క సూచించారు. ప్రభుత్వమే సర్వేలు నిర్వహించి అర్హులైన లబ్ధిదారులకు పట్టాలు ఇస్తోందని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏజెన్సీల్లో గిరిజనులు, గిరిజన నేతరులకు సాగు చేసుకుంటున్న భూములుకు పట్టాలు ఇవ్వలేదని విమర్శించారు. వాటిని గుర్తించి ఎవరు భూములు వారికి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇటీవల కొంతమంది దళారులు కలెక్టర్, డీఎఫ్​ఓడీ, ఇతర ఫారెస్టు అధికారులు సంతకాలను ఫోర్జరీ చేసి దొంగ పట్టాలను సృష్టించారని చెప్పారు. ఆ ముఠాను ఇప్పటికే ములుగు జిల్లా పోలీసులు అరెస్టు చేశారని పేర్కొన్నారు.

'రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి గ్రామాన్ని గత ప్రభుత్వం ఫారెస్ట్​లో కలిపింది. వాటిని గుర్తించి ఎవరు భూములు వారికి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. ఈ మధ్య కాలంలో కొంతమంది దళారులు కలెక్టర్, డీఎఫ్​ఓడీ, ఇతర ఫారెస్టు అధికారులు సంతకాలను ఫోర్జరీ చేసి దొంగ పట్టాలను సృష్టించారు. ఇప్పటికే 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశాం. దీపావళీ తర్వాత మరో 4 లక్షల మందికి రుణమాఫీ చేస్తాం'- సీతక్క, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి

రుణ విముక్తి చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్​ : మరోవైపు మంత్రులు సైతం రుణమాఫీకి సంబంధించి 3.5 లక్షల కుటుంబాల నిర్ధరణ జరిగిందని, మరో 4 లక్షల కుటుంబాల నిర్ధరణ జరగాల్సి ఉందని ఓ ప్రకటనలో వెల్లడించారు. మూడు విడతల్లోనే రూ.18 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లుగా తెలిపారు. రైతు కుటుంబాలను రుణ విముక్తి చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని స్పష్టం చేశారు. తాజాగా మంత్రి సీతక్క కూడా మరో 4 లక్షల మందికి దీపావళి తర్వాత రుణమాఫీ కానున్నట్లు తెలిపారు.

'ప్రభుత్వానికి సహకరించకపోగా అనవసర విమర్శలు' : బీఆర్​ఎస్​ తీరుపై తుమ్మల మండిపాటు - Minister Tummala On Loan Waiver

ABOUT THE AUTHOR

...view details