Tenders For Road works in Hyderabad :హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వీటి పరిష్కారం కోసం సిగ్నళ్లు లేని కూడళ్లే లక్ష్యంగా జీహెచ్ఎంసీ హెచ్-సిటీ ప్రాజెక్టు కింద రహదారుల పనులను మొదలు పెట్టనుంది. ఇందులో అండర్ పాస్లు, పైవంతెనలు కూడా ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రతిపాదించిన రూ.7,032 కోట్ల విలువైన 38 పనులకు పరిపాలన అనుమతులు ఇచ్చింది. సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలతో అందులోని రూ.2,373 కోట్లతో వివిధ పనులకు మొదటి దశ కింద టెండర్లు పిలవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి నిర్ణయించారు.
కేబీఆర్ పార్కు చుట్టూ : కేబీఆర్ పార్కు చుట్టూ చేపట్టే ఆరు కూడళ్ల అభివృద్ధికి అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించనుందని తెలిపింది. మిగిలిన ప్రాజెక్టులకు బల్దియా నిధులను వెచ్చిస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. నిధుల సమస్య లేనందున పనులన్నింటినీ రెండు నుంచి మూడు సంవత్సరాలలో పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు తగినట్టుగా ప్రణాళిక సిద్దం చేసుకుంటుంది.
పైవంతెనలు, అండర్ పాస్లు : జూబ్లీహిల్స్ చెక్పోస్టు కూడలిలో, కేబీఆర్ పార్కు ప్రధాన గేటు చౌరస్తాలో, రోడ్డు నం.45 కూడలిలో, ఫిల్మ్నగర్ కూడలిలో, మహారాజ అగ్రసేన్ కూడలిలో, క్యాన్సర్ ఆస్పత్రి కూడలిలో పైవంతెనలు, అండర్ పాస్లు వస్తాయి.