తెలంగాణ

telangana

ETV Bharat / state

కుటుంబ కలహాలు! - ఉరి వేసుకుని ఏఆర్​ ఎస్సై ఆత్మహత్య - AR SI DIED IN MULUGU DISTRICT

గోవిందరావుపేట మండలం పస్రాలో ఏఆర్‌ ఎస్సై ఆత్మహత్య - కుటుంబ కలహాలతో ఉరేసుకొని ఏఆర్‌ ఎస్సై (38) బలవన్మరణం - బయ్యారంలో ఏఆర్‌ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న స్వర్ణపాక లక్ష్మీ నర్సు

BAYYARAM POLICE
AR SI DIED IN MULUGU (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 6, 2025, 3:14 PM IST

SI Died in Mulugu District : ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రాలో ఏఆర్ ఎస్సై స్వర్ణపాక లక్ష్మీ నర్సు (38) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రస్తుతం తను ఉండే నివాసంలోనే ఉరి వేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బయ్యారం పోలీస్ స్టేషన్​లో ఏఆర్ ఎస్సైగా పనిచేస్తున్న స్వర్ణపాక లక్ష్మీ నర్సు స్వస్థలం అదే జిల్లా ఇల్లందు మండలం మాణిక్యపురం.

మృతుడి భార్య సునీత గోవిందరావుపేట మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధువులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details