తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : Apr 11, 2024, 7:58 AM IST

ETV Bharat / state

కిడ్నాప్‌ చేసి కోట్ల విలువైన షేర్లు బదిలీ - ఒక్కొక్కటిగా బయటపడుతున్న రాధాకిషన్‌రావు లీలలు - ex dcp Radhakishan Rao case updates

Another Case on Former EX DCP Radhakishan Rao : టాస్క్‌ఫోర్స్‌ మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌రావుపై మరో కేసు నమోదైంది. తనను కిడ్నాప్‌ చేసి క్రియా హెల్త్‌ కేర్‌ సంస్థలో కోట్ల రూపాయల విలువైన షేర్లను నలుగురు డైరెక్టర్ల పేర్ల మీదకు బలవంతంగా బదిలీ చేయించారని ఆ సంస్థ వ్యవస్థాపకుడు చెన్నుపాటి వేణుమాధవ్‌ తాజాగా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్‌ పోలీసులు రాధాకిషన్‌రావుతో పాటు మరికొందరి పేర్లను ఎఫ్ఐఆర్‌లో చేర్చి దర్యాప్తు చేస్తున్నారు.

TASK FORCE EX DCP RADHAKISHAN RAO
TASK FORCE EX DCP RADHAKISHAN RAO

టాస్క్‌ఫోర్స్‌ మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌రావుపై మరో కేసు నమోదు

Another Case on Former EX DCP Radhakishan Rao :హైదరాబాద్‌కు చెందిన చెన్నుపాటి వేణుమాధవ్‌ హార్వర్డ్‌ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసి ప్రపంచ బ్యాంకులో పనిచేశారు. భారత్‌కు తిరిగొచ్చి 2011లో క్రియా హెల్త్‌ కేర్‌ సంస్థను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఖమ్మం జిల్లాలో టెలీమెడిసిన్, జాతీయ రహదారి అత్యవసర వాహనాల సేవలు అందించే ఈ సంస్థ మొత్తం రూ.250 కోట్ల విలువైన ప్రాజెక్టులు చేపట్టింది.

Case Against Task Force EX OSD Radhakishan Rao :ఈ సంస్థలో ఇద్దరు శాశ్వత డైరెక్టర్లుగా వేణుమాధవ్, బాలాజీ, నలుగురు తాత్కాలిక డైరెక్టర్లుగా గోపాల్, రాజ్, నవీన్, రవి ఉన్నారు. దీనికి బాలాజీ సీఈవోగా వ్యవహరిస్తున్నారు. 2016-17 నాటికి సంస్థలో వేణుకు 60 శాతం, బాలాజీకి 20 శాతం, గోపాల్‌కు 10 శాతం, రాజ్‌కు-10 శాతం వాటాలున్నాయి. 2018లో నలుగురు తాత్కాలిక డైరెక్టర్లయిన వారు వేణుమాధవ్ పేరిట ఉన్న 60 శాతం షేర్లను తక్కువ ధరకు విక్రయించాలని సంస్థను పూర్తిగా తామే నడిపించుకుంటామని ఆయనపై ఒత్తిడి చేశారు.

ప్లేటు ఫిరాయించిన చంద్రశేఖర్ వేగె : ఇదే సమయంలో గోల్డ్‌షిఫ్‌ అబోడే ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ సీఈవో చంద్రశేఖర్‌ వేగె వేణుమాధవ్‌కు పరిచయమయ్యారు. తాత్కాలిక డైరెక్టర్లు షేర్లు విక్రయించాలంటూ ఒత్తిడి తెస్తున్న విషయాన్ని ఆయన అతనితో ప్రస్తావించారు. క్రియా హెల్త్‌ కేర్ సంస్థలో తాను షేర్‌హోల్డర్‌గా మారితే నలుగురు తాత్కాలిక డైరెక్టర్లతో బేరసారాలు నడిపేందుకు అవకాశముంటుందని చంద్రశేఖర్‌ వేగె వేణుకు చెప్పాడు. ఇందుకు అంగీకరించిన వేణుమాధవ్ మొత్తం రూ.40 కోట్ల విలువ చేసే 4 లక్షల షేర్లను చంద్రశేఖర్‌ పేరిట బదిలీ చేశారు. ఆ తర్వాత చంద్రశేఖర్‌ ప్లేటు ఫిరాయించి తాత్కాలిక డైరెక్టర్లతో కుమ్మక్కయినట్లు ఫిర్యాదులో వేణుమాధవ్ పేర్కొన్నారు.

డీసీపీ రాధాకిషన్‌రావుతో కలిసి పథకం :తాత్కాలిక డైరెక్టర్ల వేధింపులు ఎక్కువయ్యాయంటూ 2018 అక్టోబరు 3న బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో వేణుమాధవ్ ఫిర్యాదు చేశారు. కొన్ని రోజుల తర్వాత షేర్లు బదలాయించడం లేదని ఆరోపిస్తూ అక్టోబరులో, తాత్కాలిక డైరెక్టర్లు కూడా వేణుపై ఫిర్యాదు చేశారు. తొలుత తాను ఇచ్చిన ఫిర్యాదు పట్టించుకోకపోవడం లేదంటూ ఆయన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత చంద్రశేఖర్ వేగె, గోపాల్, రాజ్, నవీన్, రవి తదితరులు అప్పటి టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావుతో(Police Case on Radhakishan Rao)కలిసి బలవంతంగా షేర్లు బదిలీ చేయించుకోవాలని పథకం వేశారని తాజాగా ఇచ్చిన ఫిర్యాదులో వేణుమాధవ్‌ ‌తెలిపారు.

నాటి అధికార పార్టీ సుప్రీమ్‌ ఆదేశాల మేరకే- రాధాకిషన్‌రావు రిమాండ్ రిపోర్డులో కీలక విషయాలు - phone tapping case updates

2018 నవంబరు 22న ఉదయం ఖాజాగూడ వద్ద ద్విచక్రవాహనాలపై వచ్చిన ముగ్గురు వ్యక్తులు తనను అడ్డగించి తాము టాస్క్‌ఫోర్స్‌ పోలీసులమని దాడి చేశారని వేణుమాధవ్ ఫిర్యాదులో వివరించారు. అక్కడ్నుంచి బలవంతంగా టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయానికి తీసుకెళ్లారని అప్పటికే చంద్రశేఖర్‌, తాత్కాలిక డైరెక్టర్లతోపాటు పూర్ణచందర్‌రావు అనే మరో వ్యక్తి అక్కడికి చేరుకున్నారు. వంద కోట్ల విలువైన కంపెనీ వాటాను చట్టవిరుద్ధంగా బదిలీ చేయాలని బెదిరించడం దారుణమని వారికి చెప్పానని వేణు ఫిర్యాదులో పేర్కొన్నారు.

Police Case on Radhakishan Rao : సీఐ గట్టుమల్లు ఆదేశాలతో ఎస్సై మల్లిఖార్జున్‌ నకిలీ కరెన్సీ కేసులో తీసుకొచ్చిన నిందితుల్ని చితకబాది తాము చెప్పినట్లు వినకపోతే ఇదే పరిస్థితి తనకు వస్తుందంటూ బెదిరించారని వేణుమాధవ్ ఫిర్యాదులో చెప్పకొచ్చారు. డీసీపీ రాధాకిషన్‌రావు వచ్చాక చంద్రశేఖర్‌ వేగె జోక్యం చేసుకుని డీసీపీ చెప్పినట్లు విని డీల్‌కు అంగీకరించాలన్నాడని ఇంకా ప్రాణాలతో ఉన్నందుకు అదృష్టవంతుడివంటూ తాత్కాలిక డైరెక్టర్లు బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

అదే సమయంలో రాధాకిషన్‌రావు ఆదేశాలతో వేణుమాధవ్‌కు ఫోన్‌ ఇవ్వడంతో తన లాయర్‌ శ్రీనివాస్, స్నేహితుడైన లహరి రిసార్టు యజమాని సంజయ్‌కి ఆయన ఫోన్‌ చేశారు. తాను కిడ్నాప్‌ అయినట్లు సమాచారమిచ్చారు. దీంతో సంజయ్‌ డీజీపీ కార్యాలయానికి వెళ్లి సమాచారం ఇచ్చాడు. డీజీపీ ఆఫీసు నుంచి ఇన్‌స్పెక్టర్‌ గట్టుమల్లుకు ఫోన్‌ రాగా రాధాకిషన్‌రావు మాట్లాడి తనకు పైస్థాయి నుంచి ఆదేశాలు వచ్చాయని బదులివ్వడంతో వారు మిన్నకుండిపోయారని వేణుమాధవ్‌ ఫిర్యాదులో తెలిపారు.

వేణుమాధవ్‌ను బెదిరించిన రాధాకిషన్‌రావు : బయటి నుంచి ఎలాంటి సహకారం ఉండదని, ఒప్పందం చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలని రాధాకిషన్‌రావు సూచించాడని వేణుమాధవ్ తెలిపారు. ఒప్పందం చేసుకోకపోతే తప్పుడు ఆరోపణలతో మరిన్ని కేసులు పెట్టిస్తామని తాత్కాలిక డైరెక్టర్లు బెదిరించారన్నారు. తుపాకులు, కర్రలతో బెదిరిస్తూ షేర్లు బదలాయింపు ఒప్పందంపై బలవంతంగా తనతో సంతకం చేయించి వదిలేశారని వేణు ఫిర్యాదులో వివరించారు.

ఈ విషయంపై మీడియా, కోర్టులు, ఇతరులకు సమాచారం ఇస్తే చావు ఎదుర్కోవాల్సి వస్తుందని రాధాకిషన్‌రావు బెదిరించాడని వేణుమాధవ్ వెల్లడించారు. అనంతరం గట్టుమల్లు, ఎస్సై బృందం తన నుంచి రూ.10 లక్షలు వసూలు చేశారని వివరించారు. కిడ్నాప్‌ చేయించి వాటాలు బదిలీ చేయించే వ్యవహారంలో చంద్రశేఖర్‌ వేగె నలుగురు తాత్కాలిక డైరెక్టర్ల నుంచి అదనంగా రూ.10 కోట్లు తీసుకున్నాడని వేణుమాధవ్‌ పేర్కొన్నారు.

ఇటీవల రాధాకిషన్‌రావు అరెస్టు విషయం తెలుసుకుని ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేస్తున్నట్లు వేణుమాధవ్‌ ఫిర్యాదులో తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్‌ పోలీసులు రాధాకిషన్‌ రావుతో పాటు టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్లు గట్టు మల్లు, మల్లిఖార్జున్‌ సహా చంద్రశేఖర్‌ వేగె, కృష్ణ, గోపాల్‌, రాజ్‌, రవి, బాలాజీ తదితరుల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చి దర్యాప్తు చేస్తున్నారు.

రాధాకిషన్ ​రావు రిమాండ్​ పొడిగింపు - కేసు విచారణకు ప్రత్యేక పీపీని నియమించే యోచనలో ప్రభుత్వం - Telangana Phone Tapping Case

నా ఫోన్​ ట్యాప్​ చేసి రూ.కోట్లు వసూలు చేశారు - రాధాకిషన్​రావుపై రియల్​ ఎస్టేట్ వ్యాపారి ఫిర్యాదు - phone tapping case updates

ABOUT THE AUTHOR

...view details