తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Jan 22, 2024, 9:23 PM IST

Updated : Jan 22, 2024, 10:00 PM IST

ETV Bharat / sports

ఇంగ్లాండ్​తో సిరీస్​ - ఉప్పల్​ గడ్డపై టీమ్​ఇండియా రికార్డులు

Team India Test Records In Uppal Stadium : జనవరి 25న హైదరాబాద్​ వేదికగా భారత్-ఇంగ్లాండ్‌ మధ్య 5 టెస్టుల సిరీస్​ మ్యాచ్​ ప్రారంభం కానుంది. ఉప్పల్‌ మైదానంలో జరిగిన ఈ ఫార్మాట్​లో టీమ్​ఇండియా ఇప్పటివరకూ ఓడిందే లేదు. ఈ నేపథ్యంలో ఈ పిచ్​పై మన ఆటగాళ్లు సాధించిన పలు రికార్డులపై ఓ లుక్కేద్దాం.

Team India Test Records In Uppal Stadium
Team India Test Records In Uppal Stadium

Team India Test Records In Uppal Stadium : గురువారం(జనవరి 25న) హైదరాబాద్​-ఉప్పల్​ మైదానంలో ఇంగ్లాండ్​-భారత్​ మధ్య 5 టెస్టుల సిరీస్​కు తెరలేవనుంది. బజ్‌బాల్‌ క్రికెట్​ స్ట్రాటజీతో టెస్టుల్లో విరుచుకుపడుతున్న ఇంగ్లాండ్​ను టీమ్​ఇండియా చిత్తు చేయాలని సగటు క్రికెట్​ అభిమాని కోరుకుంటున్నాడు. ఆరోసారి హైదరాబాద్​ గడ్డపై టెస్టు సిరీస్​ ఆడనున్న భారత్‌కు విజయవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ జరిగిన ఐదు టెస్టుల్లో మన ఆటగాళ్లు నెలకొల్పిన రికార్డుల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఉప్పల్​ స్టేడియంలో టీమ్ఇండియా రికార్డ్స్​
2005లో తొలిసారి ఉప్పల్‌ స్టేడియంలో వన్డే మ్యాచ్​ ఆడింది టీమ్​ఇండియా. ఇదే వేదికగా ఇప్పటివరకు 5 టెస్టులాడిన భారత్​ నాలుగు మ్యాచ్‌ల్లో నెగ్గి ఓ మ్యాచ్​ను డ్రాగా ముగించింది.

  • భారత్​ x న్యూజిలాండ్‌(2010)- హైదరాబాద్(ఉప్పల్​ స్టేడియం)​ వేదికగా భారత్​కు ఇది తొలి టెస్టు మ్యాచ్‌. అయితే ఈ మ్యాచ్​ డ్రాగా ముగిసింది. ఇక ఈ మ్యాచ్​లో హర్భజన్‌ సింగ్‌ (111 నాటౌట్‌) అజేయమైన శతకాన్ని సాధించాడు.
  • భారత్​ x న్యూజిలాండ్‌(2012)- ఈ మ్యాచ్​లో భారత్​ 115 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో పుజారా (159) విజృంభించాడు. అశ్విన్‌ 12 వికెట్లు తీశాడు.
  • భారత్​ x ఆస్ట్రేలియా(2013)- 135 పరుగుల తేడాతో కాంగూరలను మట్టి కరిపించింది టీమ్‌ఇండియా. ఈ మ్యాచ్​లో పుజారా (204) డబుల్‌ సెంచరీ చేశాడు.
  • భారత్​ x బంగ్లాదేశ్‌(2017)- ఉప్పల్​ మైదానంలో జరిగిన ఈ ఏకైక టెస్టు సిరీస్​లో భారత్​ 208 పరుగుల తేడాతో బంగ్లాను చిత్తు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లి (204) డబుల్‌ సెంచరీతో విరుచుకుపడ్డాడు.
  • భారత్​ x వెస్టిండీస్‌(2018)- ఈ సిరీస్​లో 10 వికెట్ల తేడాతో టీమ్​ఇండియా గెలిచింది. ఈ మ్యాచ్​లో పంత్‌ (92), రహానె (80), పృథ్వీ షా (70) సత్తా చాటారు. ఉమేశ్‌ యాదవ్‌ 10 వికెట్లు పడగొట్టాడు.

జట్టులో లేని వీరికి స్పెషల్​ గ్రౌండ్​
విరాట్​కు
టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీకి ఉప్పల్‌ మైదానంను ఫేవరెట్‌ గ్రౌండ్‌గా చెప్పవచ్చు. ఇక్కడి పిచ్​పై అతడు ప్రదర్శించిన ఆటతీరే అందుకు సాక్ష్యం.

ఇవి సాధించాడు

  • టెస్టుల్లో 5 ఇన్నింగ్స్‌ల్లో 75.80 సగటుతో 379 పరుగులు చేశాడు.
  • ఓ డబుల్‌ సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు.

తనకు అచ్చొచ్చిన ఉప్పల్​ మైదానంలో​ మాత్రం ఈసారి మ్యాచ్‌ ఆడటం లేదు విరాట్​. వ్యక్తిగత కారణాల వల్ల అతడు ఈ టెస్టుకు దూరంగా ఉన్నాడని బీసీసీఐ వెల్లడించింది.

పుజారాకు
ప్రస్తుతం జట్టులో లేని వెటరన్‌ టెస్టు బ్యాటర్‌ పుజారాకు కూడా ఈ మైదనంలో గొప్ప రికార్డు ఉంది.

  • 5 ఇన్నింగ్స్‌ల్లో అతడు 127.50 సగటుతో 510 పరుగులు సాధించాడు.
  • ఓ డబుల్‌ సెంచరీ నమోదు చేశాడు.

బౌలింగ్​లోనూ వీరిదే హవా
బౌలింగ్‌ విషయానికి వస్తే ఉప్పల్‌ మైదానంలో జట్టు స్పిన్నర్లదే ఆధిపత్యం. ఇప్పటివరకు జరిగిన టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్‌-5 బౌలర్లలో నలుగురు స్పిన్నర్లే కావడం విశేషం.

  • సీనియర్‌ స్పిన్నర్‌ అశ్విన్‌- 8 ఇన్నింగ్స్‌ల్లో 27 వికెట్లు
  • జడేజా- 15 వికెట్లు
  • ఉమేశ్‌ యాదవ్‌- 15 వికెట్లు
  • ప్రజ్ఞాన్‌ ఓజా- 9 వికెట్లు
  • హర్భజన్‌ సింగ్‌- 7 వికెట్లు.

ఇలా అన్ని విధాలుగా టీమ్​ఇండియాకు ఉప్పల్​ మైదానం కలిసొచ్చిందనే చెప్పాలి. గురువారం(జనవరి 25)న ఇంగ్లాండ్‌తో జరిగే సిరీస్‌లోనూ జట్టు గెలవాలని క్రికెట్​ ప్రియులు ఆశిస్తున్నారు.

రవిశాస్త్రికి బీసీసీఐ ప్రతిష్టాత్మక అవార్డు - గిల్​కు కూడా

రామ్​ లల్లా ప్రాణప్రతిష్ఠ- సౌతాఫ్రికా క్రికెటర్ స్పెషల్ విషెస్

Last Updated : Jan 22, 2024, 10:00 PM IST

ABOUT THE AUTHOR

...view details