తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆసీస్‌ పర్యటనకు షమీ! - ఆ కండీషన్‌కు ఓకే చెప్తేనే జట్టులోకి ఎంట్రీ!

ఆస్ట్రేలియా పర్యటనకు షమీ - గాయం కోలుకున్నాక ఆ కండీషన్​ ఒప్పుకుంటేనే జట్టులోకి ఎంట్రీ!

Mohammed Shami Border Gavaskar Trophy
Mohammed Shami (Getty Images)

By ETV Bharat Sports Team

Published : 4 hours ago

Mohammed Shami Border Gavaskar Trophy : టీమ్ఇండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. గతేడాది వన్డే ప్రపంచ కప్ తర్వాత క్రికెట్​కు దూరమైన షమీ, ఆ తర్వాత మోకాలికి ఆపరేషన్ చేయించుకున్నాడు. అయితే పూర్తిగా కోలుకుంటున్న సమయంలో మళ్లీ ఆ గాయం తిరగబెట్టింది. దీంతో క్రీడాభిమానులు ఆందోళన చెందుతున్నారు.

మరోవైపు బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ వేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే భారత స్క్వాడ్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు షమీని సెలెక్ట్ చేయలేదు. కానీ అతడ్ని జట్టులోకి తీసుకొనే అవకాశం ఉందన్న వార్తలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. అయితే అలా జరగాలంటే మాత్రం ఓ కండీషన్‌కు షమీ ఓకే చెప్పాల్సి ఉంటుందని క్రికెట్ వర్గాల మాట.

"షమీని ఈ సారి సెలెక్ట్ చేయలేదు. కానీ, ఆసీస్‌ పర్యటన మొదలయ్యేలోపు అతడ్ని జట్టులోకి ఎంపిక చేసే అవకాశం లేకపోలేదు. అప్పటిలోపు షమీ తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సి ఉంటుంది. రంజీ ట్రోఫీలో ఆడితే మళ్లీ బౌలింగ్‌లో రిథమ్‌ను అందుకోవచ్చు. బెంగాల్‌ తరఫున నాలుగో రౌండ్‌ మ్యాచ్‌లో ఆడతాడని సమాచారం. నవంబర్‌ తొలి వారం నాటికి ఫిట్‌నెస్‌ నిరూపించుకోగలిగితే చాలు" అని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.

ఇదిలా ఉండగా, ఆసీస్‌తో పర్యటనకు కొత్త కుర్రాళ్లకు బీసీసీఐ అవకాశం ఇచ్చింది. దీంతో నితీశ్‌ కుమార్‌ రెడ్డితోపాటు కోల్​కతా ప్లేయర్​ హర్షిత్ రానాకు జట్టులో చోటు దక్కింది. నితీశ్‌ను పేస్ ఆల్‌రౌండర్‌గా ఎంపిక చేయగా, షమీ గైర్హాజరీతో రానాతో పాటు ప్రసిధ్ కృష్ణను తుది జట్టులోకి తీసుకుంది.

హర్షిత్ రాణా రిలీవ్‌
మరోవైపుకివీస్‌తో టెస్టు సిరీస్‌కు యంగ్​ ప్లేయర్​ హర్షిత్‌ రాణాను ట్రావెల్ రిజర్వ్‌గా ఎంపిక చేశారు సెలక్టర్లు. అయితే, అతడ్ని మూడో టెస్టు నుంచి బీసీసీఐ ఇప్పటికే రిలీవ్‌ చేసింది. దిల్లీ తరఫున అస్సాంతో రంజీ ట్రోఫీ బరిలోకి హర్షిత్ దిగాడు. కివీస్‌తో మూడో టెస్టు నవంబర్ 1 నుంచి ప్రారంభం కానుంది. ముంబయి వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే 0-2 తేడాతో సిరీస్‌ను కోల్పోయిన రోహిత్ సేన ఆఖరి మ్యాచ్‌లో గెలిచి పరువు నిలుపుకోవాలనే లక్ష్యంతో ఉంది.

బోర్డర్ గావస్కర్ ట్రోఫీ: 'షమీకి బదులు ఆ బౌలర్​కు ఛాన్స్ ఇవ్వాలి- అతడు కంప్లీట్ ప్యాకేజీ!'

భారత్ ఓటమితో బరిలో దిగిన షమీ- బ్యాండేజీతోనే నెట్స్​లో ప్రాక్టీస్- వీడియో వైరల్

ABOUT THE AUTHOR

...view details