తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్‌ హిస్టరీలో ఫస్ట్​టైమ్​ - అప్పుడు రోహిత్‌, కోహ్లీ ఇప్పుడు ధోని! - IPL 2024 New Captains - IPL 2024 NEW CAPTAINS

IPL 2024 New Captains : ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ప్రారంభమవ్వక ముందు నుంచే క్రికెట్ అభిమానులకు వరుస షాక్​లు తగిలాయి. క్రికెటర్ల గాయలు ఓ వైపు అయితే కెప్టెన్ల మార్పులు మరో షాక్​గా మిగిలింది. ముంబయి కెప్టెన్సీ నుంచి రోహిత్‌ను తొలగించడం అనేది అభిమానులను జీర్ణించుకోలేని విషయంగా మారింది. అయితే హిట్‌మ్యాన్‌ తరహాలోనే చెన్నైకి ఐదు టైటిల్స్‌ అందించిన ధోని కూడా తాజాగా కెప్టెన్సీ వదిలేసి ఆశ్చర్యపరిచాడు. ఐపీఎల్‌లో ముంబయి, చెన్నైని మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ టీమ్‌లుగా నిలిపిన రోహిత్‌, ధోనిని ఈ ఐపీఎల్‌లో అభిమానులు సాధారణ ప్లేయర్‌లుగా చూడనున్నారు.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Telugu Team

Published : Mar 22, 2024, 10:32 AM IST

Updated : Mar 22, 2024, 10:50 AM IST

IPL 2024 New Captains :42 ఏళ్ల ఎంఎస్ ధోనీ తనంతట తాను జట్టు కెప్టెన్సీని వదులుకోవడం వల్ల, రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా ఎన్నికయ్యాడు. ధోని, సురేశ్ రైనా, రవీంద్ర జడేజా తర్వాత చెన్నై జట్టుకు నాయకత్వం వహించిన నాలుగో కెప్టెన్‌గా రుతురాజ్ నిలిచాడు. రైనా వైస్-కెప్టెన్‌గా ఉంటూ తాత్కాలిక ప్రాతిపదికన జట్టును నడిపించగా, ధోని వైదొలిగిన తర్వాత 2022లో కొంత కాలం ఫుల్‌టైమ్‌ కెప్టెన్‌గానూ రైనా బాధ్యతలు స్వీకరించాడు. అయితే ఐపీఎల్‌లో ముంబయి, చెన్నైని మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ టీమ్‌లుగా నిలిపిన రోహిత్‌, ధోనిని ఈ ఐపీఎల్‌లో అభిమానులు సాధారణ ప్లేయర్‌లుగా చూడనున్నారు.

ఐపీఎల్​లో తొలిసారి ఇలా
ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ ఐపీఎల్ జట్టుకు నాయకత్వం వహించడం లేదు. ఐపీఎల్ 2021లోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) కెప్టెన్సీని కోహ్లీ వదిలేశాడు. ఇప్పుడు ముంబయి ఇండియన్స్‌ మేనేజ్‌మెంట్‌ నిర్ణయం వల్ల రోహిత్ శర్మ, సొంత నిర్ణయం మేరకు ధోని కెప్టెన్సీకి దూరమయ్యారు. 2008 ఐపీఎల్‌ మొదటి సీజన్‌ తర్వాత ఈ స్టార్ ప్లేయర్‌లు సాధారణ ప్లేయర్‌లుగా ఆడుతున్న లీగ్‌ ఇదే కావడం గమనార్హం.

2017లో తప్ప, ప్రతి సీజన్‌లో ధోని ఐపీఎల్‌ టీమ్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే 2022లో ధోనీ కొన్ని మ్యాచ్‌లకు మాత్రమే దూరంగా ఉన్నాడు. ఆ సమయంలో రవీంద్ర జడేజా కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఎనిమిది మ్యాచ్‌ల తర్వాత ధోని తిరిగి చెన్నై సూపర్‌ కింగ్స్‌ పగ్గాలు అందుకున్నాడు.

ఇక విరాట్ కోహ్లీ 2013 నుంచి 2021 వరకు ఆర్సీబీ కెప్టెన్‌గా వ్యవహరించాడు. రోహిత్ శర్మ కూడా 2013 సీజన్ మధ్యలో నుంచి 2023 వరకు దాదాపు పదేళ్లు ముంబయి ఇండియన్స్‌కి సారథిగా ఉన్నాడు. ఇప్పుడు హార్దిక్‌ పాండ్యా ముంబై కెప్టెన్‌గా సెలక్టయ్యాడు.

2017లో ధోని ఏ జట్టుకు కెప్టెన్‌గా లేనప్పుడు, రోహిత్, విరాట్ తమ టీమ్‌లు నాయకత్వం వహించారు. 2022లో ధోని కొంత కాలం దూరమైనప్పుడూ రోహిత్‌ ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే కోహ్లీ మాత్రం కెప్టెన్సీని డుప్లెసిస్‌కి అప్పగించాడు. కానీ ముగ్గురూ తమ కెప్టెన్సీలను వదులుకోవడం ఇదే మొదటిసారి.

కోహ్లీ కెప్టెన్‌గా లేదా ఆటగాడిగా ఐపీఎల్ టైటిల్‌ను ఎప్పుడూ గెలవలేదు. ధోనీ, రోహిత్ లీగ్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లుగా రికార్డుకెక్కారు. వీరిద్దరూ చెన్నై, ముంబయిలకు ఐదు టైటిల్స్‌ అందించారు. ఇక 2024లో ఆరో కప్పు ఎవరు కొడతారు? అని అందరూ చర్చించుకుంటుండగా ఊహించని రీతిలో ఇద్దరూ కెప్టెన్సీకి దూరమయ్యారు. అత్యధిక ఐపీఎల్ టైటిల్స్‌ గెలిచిన టీమ్‌లో సభ్యులుగా అంబటి రాయుడు, రోహిత్‌ ఉన్నారు. ఇద్దరూ ఆరు సార్లు కప్పు గెలిచిన టీమ్స్‌లో ఉన్నారు.

మొట్టమొదటి ఐపీఎల్‌ టైటిల్‌ గెలిచిన ఛాంపియన్స్‌ - ఇప్పుడు ఎక్కడున్నారంటే?

IPL 2024 టైటిల్‌ వేటకు 10 టీమ్స్‌ కెప్టెన్లు రెడీ - ఎవరి సక్సెస్‌ రేటు ఎంత?

Last Updated : Mar 22, 2024, 10:50 AM IST

ABOUT THE AUTHOR

...view details