IND VS BAN 2nd T20 :బంగ్లాదేశ్తో టీమ్ ఇండియా మూడు మ్యాచుల టీ20 సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తొలి మ్యాచ్లో విజయం సాధించిన భారత జట్టు ఇప్పుడు రెండో మ్యాచ్లోనూ భారీ విజయం సాధించింది. ఏకంగా 86 పరుగులు తేడాతో గెలుపొందింది.
222 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 135 పరుగులు మాత్రమే చేసింది. ఇక ఈ విజయంతో భారత్ 2-1తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తద్వారా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే టీ20 సిరీస్ను దక్కించుకుంది. అంతకుముందు బంగ్లాతో జరిగిన మూడు వన్డేల సిరీస్ను కూడా క్లీన్ స్వీప్ చేసింది భారత్.
లక్ష్య ఛేదనలో బంగ్లా ఇన్నింగ్స్లో మహ్మదుల్లా 41 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగతా వారంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో నితీశ్ రెడ్డి, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీశారు. అర్షదీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, మయాంక్ యాదవ్, రియాన్ పరాగ్ తలో వికెట్ పడగొట్టారు.