ETV Bharat / sports

షేక్ ఆడించిన అభిషేక్​ - సూపర్ సెంచరీ - ఆ ఘనత సాధించిన రెండో ప్లేయర్​గా రికార్డ్ - ABHISHEK SHARMA CENTURY

అదరగొట్టిన అభిషేక్ శర్మ- ఐదో టీ20లో సూపర్ సెంచరీ

abhishek
abhishek (AP)
author img

By ETV Bharat Sports Team

Published : Feb 2, 2025, 7:53 PM IST

Updated : Feb 2, 2025, 9:24 PM IST

IND VS ENG Abhishek Sharma Century : ఇంగ్లాండ్​తో జరుగుతున్న ఐదో టీ20లో టీమ్ఇండియా యంగ్​ సెన్సేషన్ అభిషేక్​ శర్మ అదరగొట్టాడు. సూపర్​ ఫామ్​తో 37 బంతుల్లో సెంచరీ(135) బాదాడు. 5 ఫోర్లు, 10 సిక్స్​లతో ప్రేక్షకులను సీట్లలో కూర్చోనీయకుండా చేశాడు!. దీంతో టీ20ల్లో అత్యంత వేగంగా శతకం బాదిన రెండో బ్యాటర్​గా నిలిచాడు. అంతకుముందు 2017లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్​లో 35 బంతుల్లో శతకం చేశాడు.

అంతేకాకుండా టీ20 మ్యాచ్​లో అత్యధికంగా సిక్స్​లు బాదిన ఇండియన్ ప్లేయర్​గా రికార్డు సృష్టించాడు. అభిషేక్​ కంటే ముందు రోహిత్​ శర్మ (శ్రీలంకతో జరిగిన 2017 మ్యాచ్​లో ), సంజు శాంసన్ (సౌత్​ ఆఫ్రికాతో), తిలక్ వర్మ (సౌత్​ ఆఫ్రికా) టీ20ల్లో పదేసి సిక్స్​లు బాదారు.

17 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ
17 బంతుల్లోనే అర్ధ శతకం బాది వేగవంతమైన ఫిఫ్టీల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు అభిషేక్​ శర్మ. దీంతో భారత్​లో టీ20ల్లో అత్యంత వేగంగా హాఫ్​ సెంచరీ బాదిన ప్లేయర్​గా రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు యువరాజ్​ సింగ్​ 12 బంతుల్లో అర్ధ శతకం బాదాడు.

అభిషేక్​ సునామీ సెంచరీతో నిర్ణీత 20 ఓవర్లలో టీమ్​ఇండియా 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లండ్‌కు 248 పరుగుల లక్ష్యాన్ని విధించింది. ఓ దశలో 280+ పరుగులు సులభంగా వస్తాయనుకున్నా అభిషేక్‌కు తిలక్‌ (24), దూబె (30) మినహా ఇతర బ్యాటర్ల నుంచి సరైన మద్దతు లభించలేదు. దీంతో 235తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. శాంసన్‌ (16), సూర్య (2), పాండ్య (9), రింకు (9) నిరాశపరిచారు . అక్షర్‌ (15) ఆఖరులో వేగంగా ఆడలేకపోయాడు. ఇంగ్లాండ్​ బౌలర్లలో కార్స్‌ 3, వుడ్‌ 2, ఆర్చర్‌, రషీద్‌, ఒవర్టన్‌ తలో వికెట్‌ తీశారు.

IND VS ENG Abhishek Sharma Century : ఇంగ్లాండ్​తో జరుగుతున్న ఐదో టీ20లో టీమ్ఇండియా యంగ్​ సెన్సేషన్ అభిషేక్​ శర్మ అదరగొట్టాడు. సూపర్​ ఫామ్​తో 37 బంతుల్లో సెంచరీ(135) బాదాడు. 5 ఫోర్లు, 10 సిక్స్​లతో ప్రేక్షకులను సీట్లలో కూర్చోనీయకుండా చేశాడు!. దీంతో టీ20ల్లో అత్యంత వేగంగా శతకం బాదిన రెండో బ్యాటర్​గా నిలిచాడు. అంతకుముందు 2017లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్​లో 35 బంతుల్లో శతకం చేశాడు.

అంతేకాకుండా టీ20 మ్యాచ్​లో అత్యధికంగా సిక్స్​లు బాదిన ఇండియన్ ప్లేయర్​గా రికార్డు సృష్టించాడు. అభిషేక్​ కంటే ముందు రోహిత్​ శర్మ (శ్రీలంకతో జరిగిన 2017 మ్యాచ్​లో ), సంజు శాంసన్ (సౌత్​ ఆఫ్రికాతో), తిలక్ వర్మ (సౌత్​ ఆఫ్రికా) టీ20ల్లో పదేసి సిక్స్​లు బాదారు.

17 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ
17 బంతుల్లోనే అర్ధ శతకం బాది వేగవంతమైన ఫిఫ్టీల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు అభిషేక్​ శర్మ. దీంతో భారత్​లో టీ20ల్లో అత్యంత వేగంగా హాఫ్​ సెంచరీ బాదిన ప్లేయర్​గా రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు యువరాజ్​ సింగ్​ 12 బంతుల్లో అర్ధ శతకం బాదాడు.

అభిషేక్​ సునామీ సెంచరీతో నిర్ణీత 20 ఓవర్లలో టీమ్​ఇండియా 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లండ్‌కు 248 పరుగుల లక్ష్యాన్ని విధించింది. ఓ దశలో 280+ పరుగులు సులభంగా వస్తాయనుకున్నా అభిషేక్‌కు తిలక్‌ (24), దూబె (30) మినహా ఇతర బ్యాటర్ల నుంచి సరైన మద్దతు లభించలేదు. దీంతో 235తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. శాంసన్‌ (16), సూర్య (2), పాండ్య (9), రింకు (9) నిరాశపరిచారు . అక్షర్‌ (15) ఆఖరులో వేగంగా ఆడలేకపోయాడు. ఇంగ్లాండ్​ బౌలర్లలో కార్స్‌ 3, వుడ్‌ 2, ఆర్చర్‌, రషీద్‌, ఒవర్టన్‌ తలో వికెట్‌ తీశారు.

Last Updated : Feb 2, 2025, 9:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.