తెలంగాణ

telangana

భక్తులకు TTD బిగ్ అలర్ట్ - తిరుమల కొండపై నీళ్లు కొన్ని రోజులే సరిపోతాయ్! - అలా చేయాల్సిందేనట! - TTD Big Alert on Water Usage

By ETV Bharat Telangana Team

Published : Aug 22, 2024, 11:59 AM IST

Water Crisis in Tirumala : తిరుమలలోని స్థానికులు, ఉద్యోగులు, యాత్రికులకు.. తిరుమల తిరుపతి దేవస్థానం కీలక సూచన చేసింది. కొండపై నీళ్లు కొన్ని రోజులే సరిపోతాయని వెల్లడించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

Water Crisis in Tirumala
TTD BIG ALERT ON WATER USAGE (ETV Bharat)

TTD Alert to Devotees on Water Usage :తిరుమలలో కొలువై ఉన్న అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడిని దర్శించుకునేందుకు ప్రపంచ నలుమూలల నుంచి నిత్యం అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. అలాగే భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా వేలాది మంది ఉద్యోగులు అక్కడ పనిచేస్తుంటారు. ఇలా నిత్యం జనంతో కిటకిటలాడే తిరుమల(Tirumala) గిరులలో నీటి వినియోగంపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. ఈ క్రమంలోనే తిరుమలలోని స్థానికులు, ఉద్యోగులు, భక్తులకు సూచనలతో కూడిన కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

తిరుమలలో ఏటా రుతుపవనాల సమయంలో కురిసే వర్షపు నీటిని నిల్వ చేసి.. సంవత్సరం పొడవునా యూజ్ చేస్తుంటారు. కానీ, ఈ సంవత్సరం ఇప్పటి వరకు తక్కువ వర్షపాతం నమోదైన కారణంగా.. తిరుమలలో ఉన్న జలాశయాల్లో నీటి నిల్వలు కనిష్ఠ స్థాయికి చేరుకున్నాయని టీటీడీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో తిరుమల అధికారులు ముందుగానే అలర్ట్ అయ్యారు. అందుబాటులో ఉన్న నీళ్లు ఎంతకాలం వస్తాయి? ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంచనాలు వేశారు.

డైలీ 43 లక్షల గ్యాలన్ల నీటి వినియోగం :

ప్రతిరోజూ తిరుమలలో దాదాపు 43 లక్షల గ్యాలన్ల నీటిని వినియోగిస్తున్నారు. అందులో 18 లక్షల గ్యాలన్లు తిరుమల డ్యామ్‌ నుంచి.. మిగిలిన నీరు తిరుపతిలోని కళ్యాణి డ్యామ్ నుంచి సేకరిస్తుంటారు. తిరుమలలోని గోగర్భం, ఆకాశ గంగ, పాప వినాశనం, కుమారధార, పసుపుధార డ్యామ్‌ల మొత్తం నిల్వ సామర్థ్యం 14,304 లక్షల గ్యాలన్లు కాగా, ప్రస్తుతం తిరుమలలో కేవలం 5,800 లక్షల గ్యాలన్ల నీరు మాత్రమే జలాశయాల్లో అందుబాటులో ఉన్నట్టు టీటీడీ అధికారులు తేల్చారు.

ఎంతో కష్టపడి తిరుమల కొండపైకి వెళ్లి, ఈ తప్పులు చేస్తున్నారా? - స్వామి వారి అనుగ్రహం లభించదు!

ఈ నేపథ్యంలో.. భక్తులకు, తిరుపతి స్థానికులకు కీలక సూచనలు చేశారు. రాబోయే రోజులలో నీటి కొరత ఏర్పడకుండా ప్రస్తుతం ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. ఈ మేరకు టీటీడీ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం తిరుమలలోని ఐదు ప్రధాన డ్యామ్‌లలో ఉన్న నీరు రాబోయే 120-130 రోజులకు మాత్రమే సరిపోతుందని టీటీడీ పేర్కొంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని భక్తులు, స్థానికులు అందుబాటులో ఉన్న నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని సూచించింది.

అక్టోబరు 4 నుంచి 12 వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలను వేలాది మంది భక్తులు సందర్శిస్తారు. కాబట్టి.. నీటి వృథాను అరికట్టడానికి, వినియోగాన్ని నియంత్రించడానికి కొన్ని చర్యలు తీసుకోవాలని టీటీడీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే భక్తులతోపాటు స్థానికులు నీటిని అనవసరంగా వృథా చేయకూడదని, పొదుపుగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తోంది.

తిరుమల భక్తులకు అలర్ట్ - నవంబర్ నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల కాబోతున్నాయ్!

ABOUT THE AUTHOR

...view details